‘చిత్రం’కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్న తేజ

తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్‌ సృష్టించిన సినిమాల్లో  ‘చిత్రం’ ఒకటి. తేజని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాణ సంస్థ

Published : 22 Feb 2021 15:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్‌ సృష్టించిన సినిమాల్లో  ‘చిత్రం’ ఒకటి. తేజని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, దివంగత నటుడు ఉదయకిరణ్‌, రీమాసేన్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు తేజ.

సోమవారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘చిత్రం 1.1’ పేరుతో సీక్వెల్‌ను ఈ ఏడాది తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ‘చిత్రం’ సినిమా కోసం పనిచేసిన 45మంది కొత్త టెక్నికల్‌ టీమ్‌ ఈ సినిమాకు పనిచేయనుంది. ఆర్పీ పట్నాయక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే నటీనటులు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని