Virata Parvam: అందుకే ‘విరాటపర్వం’ టైటిల్ పెట్టాం: వేణు ఊడుగుల
‘నీదీ నాదీ ఓకే కథ’ చిత్రంతో, తొలి ప్రయత్నంలోనే విభిన్న కథా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఊడుగుల. ద్వితీయ ప్రయత్నంగా ‘విరాట పర్వం’ తెరకెక్కించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నీదీ నాదీ ఓకే కథ’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విభిన్న కథా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఊడుగుల. ద్వితీయ ప్రయత్నంగా ఆయన ‘విరాట పర్వం’ (Viarata Parvam) తెరకెక్కించారు. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు.
* రెండో సినిమాకే మీరు నక్సల్ నేపథ్యాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం?
వేణు: నేను పుట్టి, పెరిగిన వాతావరణం, చదివిన పుస్తకాలు తదితర అంశాలు నేను ఎలాంటి సినిమాలు తీయాలో అవగాహన కల్పించాయి. నేను చూసిన కొందరి జీవితాన్ని తెరకెక్కించాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే ‘విరాటపర్వం’ తీశా. బరువైన కథా? సులువైన కథా? అని ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకోను. నేను అనుకున్న కథ తెరపైకి సరిగ్గా వచ్చిందా? లేదా? అనేది మాత్రమే చూసుకుంటా.
* మీది లెఫ్ట్ నేపథ్యమా?
వేణు: నేను తెలంగాణకి చెందిన వాడిని. ఇదొక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో పెరగడం వల్ల అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అంతేగానీ లెఫ్ట్, రైట్ అంటూ ఏమీ లేదు.
* ఈ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా?
వేణు: ఒత్తిడి లేదుగానీ సినిమా త్వరగా విడుదలైతే బాగుండేదని అనిపించేంది. కొవిడ్/లాక్డౌన్ సమయంలో అందరి పరిస్థితి ఒక్కటే కదా. అందువల్లే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఆ గ్యాప్లో రెండు కథలు రాశా. మంచి నటులు, నిర్మాత కారణంగా ఈ సినిమా ప్రారంభం నుంచీ పాజిటివ్ ఆలోచనతోనే ఉన్నా.
* ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశారు?
వేణు: కథను కాదుగానీ వెన్నెల పాత్రను సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని రాశా. ఆ క్యారెక్టర్ రాస్తుంటే తనే మదిలో మెదిలేది. ఈ సినిమాకు ముందు ఎప్పుడూ ఆమెను నేను కలవలేదు. స్క్రిప్టు పూర్తయ్యాక సాయి పల్లవిని కలిశా. కథ వినగానే ఆమె సినిమాలో నటించేందుకు అంగీకరించారు.
* ఈ సినిమాలోని సాయి పల్లవి పాత్రకు ప్రేరణ ఎవరు?
వేణు: వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ అనే ఓ అమ్మాయి జీవితాన్ని చూపించా. ఆమె పాత్రలోనే వెన్నెలగా సాయి పల్లవి నటించింది.
* ప్రేమకి నక్సలిజానికి ఎలా ముడిపెట్టారు?
వేణు: విప్లవం అనేది ప్రేమైక చర్య. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేదే కాదు. ఒక సమూహానికి వ్యక్తి మధ్య కూడా ప్రేమ ఉంటుంది. జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప కొందరు తమ జీవితాలను త్యాగం చేయలేరు.
* ఈ సినిమాకి ఏమైనా ఓటీటీ ఆఫర్లు వచ్చాయా?
వేణు: పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాను తీసుకుంటామంటూ మంచి ఆఫర్లు ఇచ్చాయి. ‘ఇది థియేటర్లలోనే చూడాల్సిన సినిమా’ అని నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ వాటిని తిరస్కరించారు.
* ఈ సినిమా ముగింపు ఎలా ఉంటుంది?
వేణు: సినిమా విడుదలకు ముందే ముగింపు సన్నివేశం గురించి చెప్పడం కష్టం. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపిస్తుందనే నమ్మకం బాగా ఉంది.
* ‘విరాటపర్వం’ టైటిల్ పెట్టడానికి కారణం?
వేణు: మహాభారతంలోని విరాటపర్వం గురించి అందరికీ తెలిసిందే. అందులో ఉన్నట్టే ఈ సినిమాలోనూ కుట్రలు, రాజకీయాలు, ఫిలాసఫీ కనిపిస్తాయి. అందుకే ఆ పేరునే పెట్టాం.
* మీరు చేస్తున్న ‘మైదానం’ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తారా?
వేణు: ఓటీటీ ‘ఆహా’ కోసం ఈ ప్రాజెక్టును చేస్తున్నాం. దీనికి నేను షో రన్నర్గా వ్యవహరిస్తున్నా. కవిత్వం అంటే నాకు ఇష్టం. అప్పుడప్పుడు రాస్తుంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.