మరోసారి మంచి మనసు చాటిన బాలకృష్ణ

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు

Published : 26 Jul 2020 02:58 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఆయన.. కరోనా నుంచి రక్షణ పొందేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి మందులు పంపారు. ఈ విషయాన్ని దర్శకుడు వి.వి.వినాయక్‌ అభిమానులతో పంచుకున్నారు.

‘‘ప్రస్తుతం అన్ని చోట్లా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బసవతారకం ఆస్పత్రి ద్వారా హోమియో మాత్రలు, విటమిన్‌ ట్యాబెట్లను బాలకృష్ణ నాకు పంపారు. కేవలం నా ఒక్కడికి మాత్రమే కాదు. సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ మందులు పంపిన బాలకృష్ణకు ధన్యవాదాలు’’ అని వి.వి.వినాయక్‌ తెలిపారు.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్‌ రోర్‌’కు విశేష స్పందన వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడగానే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర కావడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని