Puri Musings: పెళ్లికి ఆ రూల్ పెట్టాల్సిందే!
రోనా మానవజీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో విడాకుల కేసులు సైతం పెరిగిపోతున్నాయి. అసలు ఇలా పెరగడానికి గల కారణాలను జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ లో వివరించారు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మానవజీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో విడాకుల కేసులు సైతం పెరిగిపోతున్నాయి. అసలు ఇలా పెరగడానికి గల కారణాలను జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ లో వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే విందాం...
‘‘కొత్తగా పెళ్లైన అమ్మాయి-అబ్బాయి మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లారు. మరుసటిరోజు తిరిగి వెళ్లిపోదామనుకునే సరికి కరోనా కారణంగా లాక్డౌన్ అయ్యింది. అందమైన.. ఆ ఐలాండ్లో ఆ ఇద్దరు నాలుగు నెలలు లాక్ అయ్యారు. అంతే, ఆ ట్రిప్ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ కరోనా దయవల్ల మన జీవితాల్లో ఏదైతే జరగకూడదో అదే జరిగింది.. రాత్రీపగలు నెలల తరబడి భార్యాభర్తలు కలిసి ఉండాల్సి రావటం. అందుకే గతేడాది నుంచి ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ విడాకులు నమోదయ్యాయి. పెళ్లిళ్లు ఇలా అర్ధాంతరంగా ముగియడానికి కారణం ఏమిటి? అందులో మొదటిది.. ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఆశించడం. రెండోది స్వేచ్ఛ. యూకేలో అంతకు ముందుకంటే 122 శాతం విడాకులు పెరిగాయి. ఇక చైనా, అమెరికాలో అయితే చెప్పక్కర్లేదు’’
‘‘మిగతా ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో విడాకుల శాతం తక్కువే. కానీ ఇక్కడ కూడా పెరిగాయి. ఇండియాలో ఎక్కువగా విడాకులు తీసుకున్న వారిలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, మిజోరం, సిక్కీం, ఛత్తీస్గఢ్, పశ్చిమ్బెంగాల్, కేరళ ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ రోజుకి సగటున 25 విడాకుల కేసులు ఒక్క ముంబయి కోర్టులకే వస్తున్నాయి. ముంబయి, దిల్లీలో ఇటీవల జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు. గోవాలో ఇలాంటి విడాకుల గోల తట్టుకోలేక ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. పెళ్లి చేసుకొనే ముందు అమ్మాయి అబ్బాయి కచ్చితంగా కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇప్పుడు పెళ్లెందుకు? పెళ్లి అవసరమా? ఇంకోసారి ఆలోచించండి తదితర ప్రశ్నలు వేసుకోవాలి. నిజానికి ఇవి చాలా మంచి రూల్స్. ఇలాంటి నిబంధనలు అన్నిచోట్ల రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు పసుపు తాడు కట్టేసి, ఎక్కడపడితే అక్కడ పిల్లలను కనేయడం కరెక్టు కాదు. నన్నడిగితే భవిష్యత్తులో ఎలాంటి చట్టం రావాలంటే ‘అమ్మాయి అబ్బాయి కచ్చితంగా ఉద్యోగం చెయ్యాలి. రెండేళ్లు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉంటేనే కానీ పెళ్లికి అర్హులు కారు’ అనే రూల్ రావాలి. అలా వస్తే అనవసరపు పెళ్లిళ్లు తగ్గుతాయి’’
‘‘విడాకుల కోసం మనం కోర్టు చుట్టూ ఎలా తిరుగుతున్నామో, పెళ్లి కోసం కూడా కోర్టుల చుట్టూ తిరిగి, కౌన్సెలింగ్లు అన్నీ అయ్యాకే వివాహం చేసుకొనే వెసులుబాటు రావాలి. అప్పుడు నిజంగా పెళ్లి కావాలని కోరుకునేవాళ్లే మిగులుతారు. అలా చేస్తే దానంతటదే ఈ విడాకుల గోల తగ్గిపోతుంది. రాబోయో రెండు దశాబ్దాలలో.. ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిన వాళ్లంతా చనిపోతారు. వాళ్లు చనిపోగానే వివాహ వ్యవస్థ అంతా పతనమైపోతుంది. 2040 నాటికి పెళ్లిళ్లు 40 శాతానికి పడిపోతాయి. పెళ్లి మంచిది కాదని మహామహులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. కానీ మనం వినలేదు. చాలామంది ఒంటరితనం భరించలేక పెళ్లి చేసుకుంటారు. ఇది చాలా తప్పు. మీరు ఒంటరితనం భరించలేకపోతే అసలు పెళ్లే చేసుకోవద్దు. ఎందుకంటే పెళ్లయ్యాక అందరూ మళ్లీ ఒంటరివాళ్లవుతారు. మెన్ అండ్ ఉమన్ ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ మ్యారేజ్’. అందుకే ఈ కరోనా సమయంలో మొగుడుపెళ్లాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరగంట కంటే ఎక్కువ సమయం మాట్లాడుకోవద్దు. ఏదైనా ఉంటే మీ స్నేహితులతో మాట్లాడుకోండి. ఏ టీవీనో చూస్తూ కూర్చోండి. వాట్సాప్తో బిజీగా గడపండి. అటు తిరిగిపడుకోవడం నేర్చుకోండి. బీపీ వస్తే బ్రీత్ ఇన్.. బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేయండి. ఈ కష్టకాలంలో జాగ్రత్తగా ఉండండి. ఓపిగ్గా ఉందాం. మన కాపురాలు నిలబెట్టుకుందాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు