Nehashetty: నవ్వులతో ఒత్తిడిని మర్చిపోతారు
‘‘తొందర పడి ఏది పడితే అది చేసేయాలని నేనేమీ అనుకోవట్లేదు. కాస్త ఆలస్యమైనా మంచి చిత్రాలే చేయాలనుకుంటున్నా’’ అంది నటి నేహా శెట్టి. ‘మెహబూబా’, ‘గల్లీ రౌడీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ కస్తూరి ఆమె. ఇప్పుడు సిద్ధు
‘‘తొందర పడి ఏది పడితే అది చేసేయాలని నేనేమీ అనుకోవట్లేదు. కాస్త ఆలస్యమైనా మంచి చిత్రాలే చేయాలనుకుంటున్నా’’ అంది నటి నేహా శెట్టి. ‘మెహబూబా’, ‘గల్లీ రౌడీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ కస్తూరి ఆమె. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా ‘డిజె టిల్లు’లో నటించింది. విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది నేహా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
కాస్త భయపడ్డా
‘‘రాధిక పాత్ర కోసం నేనెలాంటి రిఫరెన్స్లు తీసుకోలేదు. సహజంగా నాకు అనిపించినట్లు చేసుకు వెళ్లిపోయాను. ఈ విషయంలో దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నిజానికి ఈ పాత్ర చేసేటప్పుడు కాస్త భయపడ్డాను. నేను అనుకున్నట్లు చేస్తే.. ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో? అనుకున్నా. ఆ పాత్రలో నేను నటించిన విధానం నాకు చాలా నచ్చింది. ట్రైలర్ విడుదలయ్యాక అందరూ నన్ను రాధిక ఆప్టే అని పిలుస్తున్నారు. సిద్ధు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమా ద్వారా తనతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా ఫీలవుతున్నా. సెట్లో సిద్ధుతో కలిసి నటిస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయేదాన్ని’’.
‘‘చిన్నప్పటి నుంచే నటి అవ్వాలన్న కోరిక నాకు బలంగా ఉండేది. ఆ ఇష్టంతోనే కాలేజీ చదువు పూర్తి కాగానే మోడలింగ్ చేశాను. ‘ముంగారమళై 2’ అనే మలయాళ చిత్రంతో నటిగా వెండి తెరకు పరిచయమయ్యాను. తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చింది. అలా ఆయన తెరకెక్కించిన ‘మెహబూబా’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాను. తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి.. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నా. వచ్చాక ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాల్లో నటించా. కరోనా పరిస్థితుల వల్ల ఇవన్నీ కాస్త ఆలస్యమవడంతో నాకు గ్యాప్ వచ్చినట్లయింది’’.
నవ్వి నవ్వి.. కన్నీళ్లొచ్చాయి
‘‘డిజె టిల్లు’ ట్రైలర్ చూసి అందరూ ఇది రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటున్నారు. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులు నిండిన ఒక ప్యాకేజ్ లాంటి సినిమా. నేనీ కథ విన్నప్పుడే బాగా నవ్వుకున్నాను. నవ్వి నవ్వి.. కన్నీళ్లు వచ్చేశాయి. తెలంగాణ యాసపై నాకు అంతగా అవగాహన లేదు. కానీ, స్క్రిప్ట్లో ఆ యాసలో సంభాషణలు వింటున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇందులో కామెడీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సినిమా చూస్తే.. నవ్వులతో పాండమిక్ ఒత్తిడినంతా మర్చిపోతారు’’.
హృతిక్ స్ఫూర్తితో..
‘‘నేను మంగుళూరులో పుట్టి బెంగళూరులో పెరిగాను. హృతిక్ రోషన్ తొలి చిత్రం విడుదలైనప్పుడు నాకు రెండేళ్లు. ఆయన డ్యాన్స్ నన్ను బాగా ఆకట్టుకుంది. అలా నాకూ మెల్లగా నటన పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్లో, కాలేజీలో ప్రతిఒక్కరికీ తెలుసు.. నేను కచ్చితంగా నటిని అవుతానని. తొలి సినిమా విడుదలైనప్పుడు మా కాలేజీ వాళ్లంతా సెలవు పెట్టి మరీ సినిమా చూశారు. మేము నటులం. తెరపై ఏమి చేసినా అది నటన మాత్రమే. ప్రస్తుతం నా దృష్టంతా ‘డిజె టిల్లు’పైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక.. నా తర్వాతి ప్రాజెక్ట్ల గురించి మాట్లాడతాను’’.
నాది రాధిక పాత్ర
‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు రాధిక. ఈతరం అమ్మాయిలకు ప్రతిబింబంలా కనిపిస్తుంది. నిజాయితీగా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. తనకు కరెక్ట్ అనిపించిన పనే చేస్తుంది. ఎవరేం అనుకుంటారు అనేదాని గురించి అసలు ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల విషయంలో తనకి పూర్తి స్పష్టత ఉంటుంది. ఈ లక్షణాలన్నీ నాకెంతో నచ్చాయి. అందుకే రాధిక పాత్రను త్వరగా అర్థం చేసుకుని.. ఆ పాత్రలా మారిపోగలిగాను. ట్రైలర్లో రాధిక హీరోను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు చూపించారు. కానీ, తనెందుకు అలా చేసింది? దాని వెనకున్న కారణమేంటి? అన్నది సినిమా చూశాక ప్రేక్షకులకు తెలుస్తుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...