Taapsee: ఆగస్టులో ‘దొబారా’

తాప్సీ ప్రధానపాత్రలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘దొబారా’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. 2021లోనే ఈ చిత్రం ప్రారంభమైనా విడుదల ఆలస్యమైంది. ఆగస్టు 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.‘‘ఓ యువతి...

Updated : 13 May 2022 13:48 IST

తాప్సీ ప్రధానపాత్రలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘దొబారా’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. 2021లోనే ఈ చిత్రం ప్రారంభమైనా విడుదల ఆలస్యమైంది. ఆగస్టు 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.‘‘ఓ యువతి చనిపోయిన అబ్బాయి ఆత్మతో మాట్లాడిన తర్వాత గతంలోకి వెళ్లి అతడి ప్రాణాలను ఎలా రక్షించిందన్నదే కథ. టైమ్‌ ట్రావెల్‌, డైమెన్షన్‌ అంశాలతో కథనం ఆసక్తికరంగా ఉండనుంది. 2:12 సంఖ్యకు కథకు సంబంధం ఏంటనేది సస్పెన్స్‌’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పానిష్‌లో విడుదలైన ‘మిరాజ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఏక్తాకపూర్‌ ‘కల్ట్‌ మూవీస్‌’, సునీర్‌ ఖేత్రాపాల్‌ ‘అథీనా’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని