Dongalunnaru Jaagratha: కారు దొంగతనం చేద్దామని వెళ్లి అందులోనే ఇరుక్కుపోతే..?

లక్షలు విలువ చేసే ఖరీదైన కారు.. దాన్ని ఎలాగైనా దొంగిలించాలనుకున్నాడో దొంగ.. ఇంకేముంది తనకు తెలిసిన టెక్నిక్‌తో

Published : 15 Sep 2022 13:20 IST

హైదరాబాద్‌: లక్షలు విలువ చేసే ఖరీదైన కారు.. దాన్ని ఎలాగైనా దొంగిలించాలనుకున్నాడో దొంగ.. ఇంకేముంది తనకు తెలిసిన టెక్నిక్‌తో కారు తలుపు తెరిచాడు. డోరు వేసుకుని ఎంచక్కా లోపల కూర్చొన్నాడు. అంతే ఆ డోర్లు లాక్‌ అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా రాలేదు. స్నేహితులను పిలిచాడు. వాళ్లు కూడా ఏం చేయలేకపోయారు. మరి ఆ దొంగ దొరికిపోయాడా? ఆ కారు నుంచి బయటపడ్డాడా? తెలియాలంటే ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jaagratha) చిత్రాన్ని చూడాల్సిందే.

డి.సురేష్‌బాబు, సునీత తాటి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. శ్రీసింహా కోడూరి కథానాయకుడు. ప్రీతి అస్రాని కథానాయిక. సతీష్‌ త్రిపుర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’చిత్రాన్ని సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: యశ్వంత్‌.సి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని