Drishyam 3: ముగింపు ‘దృశ్యం’

వరుసగా వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.    మలయాళంలో జీతూజోసెఫ్‌  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పునర్నిర్మితం అవుతూ ప్రేక్షకుల్ని మెప్పించాయి.

Updated : 14 Aug 2022 07:41 IST

వరుసగా వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. మలయాళంలో జీతూజోసెఫ్‌ (Jeethu Joseph) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పునర్నిర్మితం అవుతూ ప్రేక్షకుల్ని మెప్పించాయి. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి. మలయాళంలో మోహన్‌లాల్‌ (Mohan Lal) నటించగా, తెలుగులో వెంకటేష్‌(Venkatesh) కథానాయకుడు. కథానాయకుడు తన సినిమా తెలివి తేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ రావడమే ఈ కథ.  ఈ కథకి ముగింపుగా మూడో భాగం (Dhrishyam 3) సిద్ధమవుతోంది. త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు పోస్టర్‌ ద్వారా వెల్లడించాయి సినీ వర్గాలు తెలిపాయి. ఆ పోస్టర్‌లో మోహన్‌లాల్‌ సంకెళ్లతో కనిపిస్తున్నారు. మరి ఈసారి కథానాయకుడు పోలీసులకి దొరికాడా లేక తప్పించుకున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్‌ అయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని