ek mini katha: ఓటీటీలో వచ్చేది అప్పుడే!

‘ఏక్‌ మినీ కథ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌ జంటగా నటించిన చిత్రమిది. దర్శకుడు కార్తీక్‌ రాపోలు తెరకెక్కించారు.

Updated : 21 May 2021 10:55 IST

‘ఏక్‌ మినీ కథ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌ జంటగా నటించిన చిత్రమిది. దర్శకుడు కార్తీక్‌ రాపోలు తెరకెక్కించారు. యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పోస్టర్లని పంచుకున్నారు. ‘‘యువతరం మెచ్చే ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనికి దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం’’ అని చిత్ర బృందం తెలియ జేసింది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని