Bollywood News: ఐఎస్‌ఐ ఏజెంట్‌గా..!

సల్మాన్‌ ఖాన్‌, కత్రీనా కైఫ్‌ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. మనీష్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కతురన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. ఇందులో ఆయన పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. సల్మాన్‌ ఇండియాకి చెందిన ‘రా’ ఏజెంట్‌ పాత్రలో .

Updated : 06 Sep 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. మనీష్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. ఇందులో ఆయన పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. సల్మాన్‌ ఇండియాకి చెందిన ‘రా’ ఏజెంట్‌గా చేస్తున్నారు. ఇమ్రాన్‌ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపించనున్నారట. చిత్రాన్ని తిరిగి జూన్‌ మధ్యలో ప్రారంభించనున్నారనే వార్తలు వస్తున్నాయి. సినిమా కీలక సన్నివేశాల కోసం షూటింగ్‌ని విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమై, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.

ఇక కత్రినా కూడా ఐఎస్ఐ ఏజెంట్ జోయగా నటిస్తోంది. ఆమె పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. రా ఏజెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందాహై’కి ఈ సినిమా సీక్వెల్‌. ఇదిలా ఉంటే ఇమ్రాన్‌, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రం ‘చెహ్రే’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అమితాబ్‌ న్యాయవాది వీర్‌ పాత్రలో నటించగా, ఇమ్రాన్‌ వ్యాపారవేత్త కరణ్‌ ఒబెరాయ్‌గా కనిపించనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని