Geetha: చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఉంది: నటి గీత
ఆలీతో సరదాగాలో నటి గీత పంచుకున్న విశేషాలివే
ఇంటర్నెట్డెస్క్: ఆమె అమ్మ పాత్రలు చేసినా.. అక్క పాత్ర వేసినా ఒదిగిపోతారు. హీరోయిన్గా చేసినప్పుడు ఆమె కోసమే కుర్రకారు సినిమాలు చూసేవారు. ఎలాంటి పాత్రకైనా జీవం పోసే నటి గీత. ఆమె పాత్రను పోషించినట్టు అనిపించదు.. ప్రేమించినట్టు ఉంటుంది. 40 ఏళ్ల నట ప్రస్థానంలో దక్షిణాది భాషల్లో 200లకుపైగా చిత్రాల్లో నటించారు. ఈటీవీ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న గీత తన సినీ విశేషాలను పంచుకున్నారు.
అలీ: మీరు ఇప్పుడెక్కడ ఉంటున్నారు..? ఇండియాలోనా.. అమెరికాలోనా? ఈ ప్రశ్న ఎందుకంటే మీరు ఇక ఇండియాకు రారు అని ప్రచారం జరుగుతోంది..
గీత: అందరూ అనే విషయం నిజమే. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లా. బాధ్యతలు తగ్గిన తర్వాత మళ్లీ చెన్నైకి వచ్చా. మా బాబు చదువు పూర్తైంది. జాబ్ చేస్తున్నాడు. మా ఆయన సీఏగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అలీ: డ్యాన్స్ రాదంటున్నారు.. ‘సాగర సంగమం’లో కమల్హాసన్ పక్కన డ్యాన్స్ ఎలా చేశారు..?
గీత: ఆ సినిమాలో నేనెక్కడ డ్యాన్స్ చేశాను. ఆయనే కదా డ్యాన్స్ చేసింది. నేను కేవలం అటు ఇటు పరిగెత్తేదాన్ని. అలా పరిగెత్తడానికి కూడా రిహార్సల్స్ చేసేదాన్ని (నవ్వులు).
ఎన్ని భాషల్లో నటించారు..?
గీత: మొదటి సినిమా తమిళంలో ‘భైరవి’. రెండో సినిమా తెలుగులో చేశాను. కృష్ణంరాజు నటించిన ‘మనవూరి పాండవులు’. ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చా. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాట్లాడతాను. అన్ని భాషల్లో కలిపి 250 సినిమాలు చేసి ఉంటా.
మీది పెద్దలు కుదిర్చిన వివాహమా? లేదా ప్రేమ పెళ్లి చేసుకున్నారా?
గీత: పెద్దలు కుదిర్చిన వివాహమే. ‘గుప్పెడు మనసు’ సీరియల్ చేస్తున్నప్పుడు హిందూ పత్రికకు చెందిన ఒకావిడ (నా భర్త వాళ్ల మేనత్త) నాకు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతుండేవారు. ఓసారి ఆమె మా అమ్మతో మాట్లాడారు. ‘మీ అమ్మాయికి ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదు’ అని అడిగారు. దానికి మా అమ్మ మంచి అబ్బాయి దొరికితే చేస్తామని బదులిచ్చింది. దాంతో ఆ మహిళ.. మా కుటుంబంలో ఓ అబ్బాయి ఉన్నాడని చెప్పింది. అలా సంబంధం కలిసింది. మా ఆయన నా సినిమాలు ఒక్కటీ చూడలేదు. మా నాన్నగారిది నెల్లూరు. మా అత్త వాళ్లది చెన్నై.
కన్నడ పరిశ్రమలో మీకు ముద్దు పేరు ఉందట.. నిజమేనా?
గీత: అక్కడికి నటిగా వెళ్లాను. అక్కడ నటించిన అన్ని సినిమాల్లో దాదాపు ఏడుపు పాత్రలే చేశాను. అందుకే ఏడుపు గీత అని పిలుస్తారు.
తెలుగులో మీకు ‘మనవూరి పాండవులు’ తొలి సినిమా కదా..?
గీత: కృష్ణంరాజు, జయకృష్ణ వల్లే ఆ సినిమా వచ్చింది. నేను నటిగా తెలుగు తెరకు పరిచయం కావడానికి కృష్ణంరాజు ముఖ్య కారణం. ఆయన లేరంటే చాలా బాధగా ఉంది (కన్నీటి పర్యంతమయ్యారు).
ఇప్పటికీ చిరంజీవితో సినిమా చేయాలని ఉందని మీరు అందరితో చెబుతారట కదా..?
గీత: ఆయన నా అభిమాన హీరో. ఆయనతో ఒక్కసారైనా నటించాలని ఉంది. ఆయన కళ్లంటే నాకెంతో ఇష్టం. ఆయన డ్యాన్స్ బాగా చేస్తారు.
నాలుగో తరగతిలో ఏదో జరిగిందని మీ నాన్నగారు బడితపూజ చేశారట ఎందుకు..?
గీత: రోజూ 3.30 గంటలకు ఇంటికి వెళ్లేదాన్ని. కానీ ఓ రోజు సాయంత్రం ఆరున్నర అయినా ఇంటికి వెళ్లలేదు. జారుడు బండ ఆడుకుంటూ ఉండిపోయా. నేను ఎక్కడికి వెళ్లిపోయానో తెలియక ఇంట్లో వాళ్లందరూ కంగారుపడ్డారు. ఇంటికి వెళ్లగానే.. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? అని నాన్న అడిగితే.. జారుడు బండ ఆడుకుంటూ ఆలస్యమైందని చెప్పా. బెల్ట్తో కొట్టారు. అప్పటి నుంచి అమ్మనాన్నలతో చెప్పకుండా ఏ పనిచేయలేదు. 8వ తరగతి వరకే చదువుకున్నా.
‘బాలచంద్రుడు’ సినిమాలో మహేశ్తో నటించారు కదా..?
గీత: అవును. అందులో కృష్ణుడు పాత్ర మహేశ్ చేశాడు. మహేశ్తో పాటు వాళ్ల అమ్మమ్మ వచ్చేది. వీడు పెద్ద హీరో అవుతాడని అప్పట్లో ఆమె అంటుండేది. ఇప్పుడు ఆయన సూపర్స్టార్ అయ్యారు కదా..!
మీరు నవ్వడం వల్ల ఇమిగ్రేషన్ అధికారి బాగా హర్ట్ అయ్యారట పాపం..!
గీత: నిజమేనండి. ఓసారి మలయాళం నటులతో కలిసి దుబాయ్లో మ్యూజికల్ నైట్కు వెళ్లా. ఎయిర్పోర్ట్లోనే మేమంతా కలిసి స్కిట్ ప్రాక్టీస్ చేశాం. అందులో నాది చాలా ఫన్నీ రోల్. స్కిట్లో భాగంగా జోక్స్ వేసుకుని నవ్వుకుంటుంటే.. నేను ఆయన్నే చూసి నవ్వుతున్నానని ఓ ఇమిగ్రేషన్ అధికారి అనుకున్నారు. నా ముందు ఉన్న వారందరికీ ఇమ్మిగ్రేషన్ స్టాంపు వేశారు.. నాకు మాత్రం అస్సలు అనుమతి ఇవ్వలేదు. భారత అధికారులు మాట్లాడిన తర్వాత పంపించారు. ఇకపై ఎయిర్పోర్ట్లో నవ్వకూడదని అప్పుడు ఫిక్స్ అయిపోయా.
అమెరికా ఎందుకు వెళ్లారు..?
గీత: పెళ్లయ్యింది కదా.. అందుకే వెళ్లా. అప్పట్లో చాలా బిజీగా ఉన్నా. బాబు పుట్టిన మూడేళ్లకు ఇండియా వచ్చా. కన్నడ, మలయాళంలో సినిమాలు చేశా.
మలయాళం నేర్చుకోవడానికి ఎంత కాలం పట్టింది..? అక్కడివాళ్ల పిలుపునకు హర్ట్ అయ్యారట ఎందుకు..?
గీత: మలయాళం భాష రాదని సినిమా ఓకే చేయలేకపోయా. నా డేట్స్ కోసం వాళ్లు చాలారోజులు తిరిగారు. చివరికి ఒప్పుకొన్నా. ట్యూటర్ని పెట్టి నెలరోజులు భాష నేర్పారు. తెలుగులో ఎక్కడికి వెళ్లినా గౌరవంగా పిలుస్తారు. మలయాళంలో కాస్త ఇబ్బంది పడ్డా. ఏయ్.. హుషు.. అని పిలుస్తుండేవారు. అది అక్కడివాళ్లకు అలవాటు. మొదట నాకు ఏమీ అర్థం కాలేదు. వాళ్లకు మర్యాదగా పిలవడం రాదనుకున్నాను.
ద్రోహి షూటింగ్లో పీసీశ్రీరామ్తో గుర్తుంచుకొనే సందర్భం ఉందట ఏంటది..?
గీత: రాజ్ కమల్ బ్యానర్లో సినిమా అది. అర్జున్తో నటించాలి. కమల్ వచ్చి డైలాగ్ చెప్పి సింపుల్గా ఉండాలని చెప్పారు. రిహార్సల్స్ లేదన్నారు. కానీ పీసీశ్రీరామ్ ఒకసారి రిహార్సల్ చేయాలన్నారు. కమల్ అవసరం లేదన్నారు. నటించిన తర్వాత కమల్ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. సారిక కూడా మెచ్చుకున్నారు.
‘పట్నం వచ్చిన పతివ్రతలు’లో ఒకరికి గుణపాఠం చెప్పాలనుకున్నారట ఎవరికి..?
గీత: ఏలూరులో షూటింగ్. రాధిక చాలా అల్లరి అమ్మాయి. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ మేనేజర్ ఇబ్బందిపెట్టేవాడు. అతడిని ఓ ఆట ఆడుకోవాలని రాధిక.. ఓసారి విరేచనాలయ్యే బబుల్గమ్ తెచ్చి ఇచ్చింది. రెండు, మూడుసార్లు బాత్రూమ్కు పరిగెత్తాడు. ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఇంటికి వెళ్తానని వెళ్లిపోయాడు.
ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలతో సినిమాలు చేశారా?
గీత: ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజులతో చాలా సినిమాలు చేశా.
ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు..? జాతీయ అవార్డు తృటిలో తప్పిపోయిందట..?
గీత: 1977లో వచ్చా. నాకు జాతీయ అవార్డు రాకుండా మిస్ చేశారనే అందరూ చెప్పుకొంటారు. ఎందుకంటే మలయాళంలో నేను నటించిన ‘పంచాగ్ని’ అద్భుతమైన చిత్రం. అందులో నేను నక్సలైట్ పాత్ర పోషించా. ఏడాది పాటు ఈ సినిమా థియేటర్లలో ఆడింది. దీనిని చూసిన వారు.. ‘సూపర్ మూవీ. ఈ ఏడాది మీకే తప్పకుండా జాతీయ అవార్డు వస్తుంది’ అని చెప్పారు. జాతీయ అవార్డుల జ్యురీలో నాకు తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు. ఓసారి వాళ్లు నన్ను కలిసి.. ‘మీ సినిమా నామినేషన్కు వెళ్లింది. అందరికీ నచ్చింది. మీకు ఇవ్వాలనుకున్నాం. కాకపోతే అంతర్గతంగా ఉన్న కొంతమంది మాత్రం అంగీకరించలేదు’ అని చెప్పారు. ఎందుకు? అని అడగ్గా.. ‘మీరు మలయాళీ, కన్నడ నటి కాదని పక్కన పెట్టేశారు’ అని చెప్పారు.
ఒక సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ అనుకున్న తర్వాత పక్కన పెట్టేశారట..?
గీత: ఆ సినిమా పేరు నాకు గుర్తు లేదు. అప్పట్లో నేను మలయాళంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఒక ఏడాదిలో 18 సినిమాలు చేశా. అలాంటి సమయంలో తెలుగులో ఓ ఆఫర్ వచ్చింది. ఓకే చేశా. డేట్స్ కూడా ఇచ్చా. ఏమైందో ఏమో ఆ పాత్రకు నేను సరిపోనని వాళ్లే అనేసుకుని నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా నన్ను తొలగించేశారు.
పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని అనుకున్నారా?
గీత: అలా ఏం లేదు. కొంత విరామం తీసుకున్నా. నా భర్త ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తుండేవారు. ఇష్టమైతే సినిమాల్లో చెయ్. ఆసక్తి లేకపోతే వదిలేయ్ అని చెబుతుండేవారు. ప్రస్తుతం మా కుటుంబం మొత్తం చెన్నైలోనే ఉంటుంది.
మీ సినిమాలు చూసి మీ అమ్మగారే విమర్శించేవారట కదా?
గీత: అవునండి. సినిమాలో నీ పాత్ర బాగుందా? సెట్లో బాగానే చూసుకుంటున్నారా? ఈ రెండు ప్రశ్నలనే మా అమ్మ ఎక్కువగా అడుగుతుండేవారు. నేను నటించిన సినిమా ప్రివ్యూలకు అమ్మ వస్తుండేవారు. ప్రివ్యూ చూసిన వెంటనే తన స్పందన చెప్పేసేది. ‘ఈ సీన్లో నువ్వు బాగా నటించలేదు. ఇక్కడ చీర సరిగ్గా కట్టుకోలేదు. ఈ సీన్లో కళ్లు పక్కకు తిప్పావు’ అంటూ ఏదో ఒక వంక పెడుతుండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి