Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్‌ ప్రశ్నకు రామ్‌చరణ్‌ ఏమన్నారంటే?

Evaru Meelo Koteeswarulu: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికర కార్యక్రమం సిద్ధమైంది. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా

Updated : 15 Aug 2021 17:42 IST

హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికర కార్యక్రమం సిద్ధమైంది. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌కు యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ విచ్చేసి సందడి చేశారు.  ఎన్టీఆర్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ ‘‘ఈనెల 22న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నాం. సోదరుడు రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ఈ కర్టెన్‌ రైజర్‌ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.

ఇక షోలోకి  చెర్రీ ఎంట్రీ ఇచ్చి, హోస్ట్‌సీట్‌లో కూర్చోబోయారు. వెంటనే అడ్డుపడిన ఎన్టీఆర్‌.. అది హాట్‌ సీటు‌.. ఇది హోస్ట్‌ సీటు అని చెప్పడంతో చరణ్‌ వెళ్లి హాట్‌ సీటులో కూర్చొన్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చివరకు ఎన్టీఆర్‌ వేసిన ప్రశ్న విన్న తర్వాత ‘సీటు హీట్‌ ఎక్కుతోంది.. బ్రెయిన్‌ హీట్‌ ఎక్కుతోంది’  అంటూ చరణ్‌ సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం అలరించేలా ఉంటుందని అర్థమవుతోంది. మరి పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే ఆగస్టు 22వ తేదీ రాత్రి 8.30గం.ల వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ఆసక్తికర ప్రోమో చూసేయండి. అన్నట్లు వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని