Raghavendra Rao: కొంచెం తీపి.. కొంచెం కారం.. నా సినీ ప్రేమలేఖ
రాఘవేంద్రరావు.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు సినిమాకి సరికొత్త కమర్షియల్ లెక్కలు నేర్పించి.. కోట్ల వసూళ్లు కురిపించిన దర్శకుడాయన. ఎన్టీఆర్, ఏయన్నార్ల మొదలు.. మహేష్బాబు, అల్లు అర్జున్ల వరకు..
రాఘవేంద్రరావు.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు సినిమాకి సరికొత్త కమర్షియల్ లెక్కలు నేర్పించి.. కోట్ల వసూళ్లు కురిపించిన దర్శకుడాయన. ఎన్టీఆర్, ఏయన్నార్ల మొదలు.. మహేష్బాబు, అల్లు అర్జున్ల వరకు.. అందరితోనూ హిట్లు కొట్టి, సినీప్రియులతో శభాష్ అనిపించుకున్న దర్శకేంద్రుడాయన. ఇన్నాళ్లు కెమెరా వెనకుండి వెండితెరపై మ్యాజిక్ చేసిన రాఘవేంద్రరావు.. ఇప్పుడు పుస్తక రచయితగా కలం కదిలించారు. ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ అంటూ తన సినీ ప్రయాణాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వెంకటరమణ అభినందనలతో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సోమవారం రాఘవేంద్రరావు 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పుస్తకానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు నామీద చూపించే అభిమానానికి కృతజ్ఞుడిని. దాదాపు 45 ఏళ్ల పాటు మీడియాలో, మైక్ ముందు మాట్లాడని నేను... ఈటీవీలో ప్రసారమైన ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో మనసు విప్పాను. తర్వాత ‘కేఆర్ఆర్ క్లాస్ రూమ్’ పేరుతో 40కిపైగా వీడియోలు చేసి యూట్యూబ్లో ఉంచాను. ఈ పుట్టిన రోజు నాకెంతో ప్రత్యేకమైనది. నా జీవితంలో మొదటిసారి ఒక పుస్తకం రాశాను. దర్శకుడిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ క్రమంలో నేను నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, అనుభూతుల్ని నా తర్వాతి తరాలకు ఉపయోగపడేలా ఈ పుస్తకం తీర్చిదిద్దాను. ఈ పుస్తకావిష్కరణ సభ ఈటీవీ ఆధ్వర్యంలో జరగడం ముదావహం. ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలోని ఈతరం దర్శకులంతా ఒకే వేదికపైకి రావడం, నా నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ వేడుక జరగడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ‘అబద్ధాలు రాయడం అనర్థం. నిజాలు రాయటానికి భయం..’ అంటూ దీన్ని మనసు పెన్తో రాశాను. ఈ పుస్తకాన్ని చాలా ఓపెన్గా రాశాను. ఏదీ కప్పి చెప్పలేదు. అలాగే విప్పి చెప్పలేదు. కొంచెం తీపి.. కొంచెం కారం. ఈ పుస్తకం త్వరలో నవోదయ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. పాఠకులందరూ దీన్ని చదివి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు రాఘవేంద్రరావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు