Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి కన్నుమూత
పలువురు తమిళ హీరోలకు తెలుగులో గాత్రదానం చేసి ఆ పాత్రలకు ప్రాణం పోసిన డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి (Srinivasa Murthy) (50) శుక్రవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.
పలువురు తమిళ హీరోలకు తెలుగులో గాత్రదానం చేసి ఆ పాత్రలకు ప్రాణం పోసిన డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి (Srinivasa Murthy) (50) శుక్రవారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. విజయనగరం నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడిన శ్రీనివాసమూర్తి ఆరంభంలో గాయకుడు కావాలని ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత 1993లో డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టారు. కాంచన్బాబు తెరకెక్కించిన ‘పక్కపేజీ’ చిత్రానికి తొలిసారి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోని ‘దొంగ దొంగ’ చిత్రానికి ప్రశాంత్కు డబ్బింగ్ చెప్పారు. అప్పటి నుంచే కథానాయకులకు గాత్రం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘ప్రేమికుడు’, ‘ప్రేమదేశం’, ‘ప్రేమలేఖ’ ఇలా చాలా సినిమాలకు గాత్రం ఇచ్చారు. అంతేకాకుండా నటుడిగా సాయికుమార్ బిజీ కావడంతో ఓ దశలో రాజశేఖర్కు కూడా డబ్బింగ్ చెప్పారు. ‘మా ఆయన బంగారం’ లాంటి పలు సినిమాలకు గాత్రం అందించారు. అజిత్కు ‘ప్రేమలేఖ’ చిత్రం నుంచి అన్ని సినిమాలకు చెప్పారు. ‘గజిని’ చిత్రంతో సూర్యతో ఆయన ప్రయాణం మొదలైంది. ‘సింగం’తో పాటు ఆయన నటించిన అన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. అలాగే విక్రమ్ చిత్రాలకు కూడా గాత్రం అందించారు. ‘అపరిచితుడు’లో రెమో పాత్రకు విక్రమ్ డబ్బింగ్ చెప్పినప్పటికీ.. ఆయనకే నచ్చకపోవడంతో శ్రీనివాసమూర్తిని పిలిపించి డబ్బింగ్ చెప్పించడం విశేషం. అలాగే ఉషాకిరణ్ మూవీస్ బ్యానరుపై వచ్చిన ‘పాడుతా తీయగా’లో వినీత్కు, ‘డాడి డాడి’లో హరీష్కు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ పాత్రకు గాత్రం అందించారు. శ్రీనివాసమూర్తి మృతిపట్ల డబ్బింగ్ సంఘాలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘శ్రీనివాసమూర్తి మరణం వ్యక్తిగతంగా తీరనిలోటు. నా నటనకు ఆయన తన మాటలతో ప్రాణం పోశారు. మిమ్మల్ని కోల్పోవడం బాధాకరంగా ఉంది’ అని ట్విట్ చేశారు సూర్య. శ్రీనివాసమూర్తికి కుమార్తె అపర్ణ, కుమారుడు నవీన్శర్మ ఉన్నారు. కుమార్తె డెంటిస్టు. కుమారుడిని హీరో చేయాలని ఆశ పడేవారు. శ్రీనివాసమూర్తి అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి.
న్యూస్టుడే, కోడంబాక్కం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ