Waltair Veerayya: చిత్ర ప్రదర్శన ఆలస్యం.. థియేటర్‌ అద్దాలు పగలగొట్టిన ప్రేక్షకులు

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Published : 13 Jan 2023 11:10 IST

పొన్నూరు: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్‌ సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. తమ అభిమాన హీరో చిత్రాన్ని వీక్షించేందుకు తెల్లవారుజాము నుంచే అభిమానులు  థియేటర్ల ఎదుట బారులు తీరారు. అయితే, గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీలక్ష్మీ థియేటర్‌లో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్‌ షో చూసేందుకు థియేటర్‌ వద్దకు భారీగా అభిమానులు తరలి రాగా.. సాంకేతిక లోపంతో సినిమాని ప్రదర్శించలేకపోతున్నామని సిబ్బంది ప్రకటించింది. ఎంతోసేపు వేచి ఉన్నప్పటికీ సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వాళ్లు మరింత ఆగ్రహానికి లోనై థియేటర్‌ అద్దాలు పగలగొట్టారు. థియేటర్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని