Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ (Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్ (Madhavan) స్వీయ దర్శకత్వంలో...
నెటిజన్ వ్యాఖ్యలపై నటుడి క్లారిటీ
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ (Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకొని నటుడు మాధవన్ (Madhavan) స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry). ఈ సినిమాకి మాధవన్ నిర్మాతగానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని తెరకెక్కించడం కోసం మాధవన్ తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందంటూ తాజాగా ఓ నెటిజన్ వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మాధవన్ దీన్ని రూపొందించారంటూ నెటిజన్ చేసిన ట్వీట్పై మాధవన్ ఏమన్నారంటే..!
‘‘రాకెట్రీకి డబ్బులు సమకూర్చడం కోసం మాధవన్ తన ఇంటిని అమ్ముకున్నాడు. వేరే సినిమాలతో కమిట్మెంట్ ఉండటంతో ‘రాకెట్రీ’ దర్శకుడు అప్పటికప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకోగా.. మాధవనే మెగా ఫోన్ పట్టారు. మరోవైపు ఆయన కుమారుడు వేదాంత్.. స్విమ్మింగ్లో దేశం కోసం పతకాలు సాధిస్తున్నాడు. ఇలాంటి గొప్ప నటుడికి అభిమానిగా ఉన్నందుకు గర్విస్తున్నా’’ అంటూ తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానిపై స్పందించిన మాధవన్.. సదరు నెటిజన్ మాటల్లో నిజం లేదని చెప్పారు. ‘‘దయచేసి నా త్యాగాన్ని అతిగా చూడకండి. ఇల్లు లేదా ఏ ఇతర ఆస్తులను నేను కోల్పోలేదు. నిజానికి రాకెట్రీలో భాగమైన వారందరూ ఈ ఏడాది సగర్వంగా భారీ మొత్తంలో ఆదాయపు పన్ను చెల్లించనున్నారు. దేవుడి దయ వల్ల మా సినిమాకి మంచి లాభాలే వచ్చాయి. ఇప్పటికీ నేను నా ఇంట్లోనే నివసిస్తున్నా. ఈ ఇంటినే ప్రేమిస్తున్నా’’ అని మాధవన్ చెప్పుకొచ్చారు.
కథేంటంటే:
ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త, గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డ నంబి నారాయణన్ జీవిత కథే ఈ చిత్రం. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో నంబి నారాయణన్ చదువుకొన్న రోజులు మొదలుకొని.. ఆరోపణల నుంచి విముక్తి కావడం వరకు ఈ కథ సాగుతుంది. ఇస్రో కోసం ఆయన చేసిన కృషి, దేశం కోసం చేసిన త్యాగాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు మాధవన్. సూర్య, షారుఖ్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. రూ.25 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.50 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 ఏళ్ల క్రితం అలా వెళ్లాం.. ఇప్పుడు గర్వంగా ఉందంటూ అల్లు శిరీష్ పోస్ట్
15 ఏళ్ల క్రితం టూరిస్ట్లుగా వెళ్లినచోటే అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అల్లు శిరీష్ పేర్కొన్నారు. -
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ హీరోతో నా తొలి సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది: కృతి సనన్
తన మొదటి సినిమా సల్మాన్తో నటించాలని కలలు కన్నట్లు కృతి సనన్ చెప్పారు. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి