Kollywood: ‘హీరోయిన్లు అందుకే పారిపోతున్నారు’

కోలీవుడ్‌ నటులు, హీరోలపై గాయత్రి రఘురామ్‌ అనే కొరియోగ్రాఫర్‌ ఆరోపణలు చేశారు.

Published : 31 May 2021 01:09 IST

చెన్నై: కోలీవుడ్‌ నటులు, హీరోలపై గాయత్రి రఘురామ్‌ అనే కొరియోగ్రాఫర్‌ ఆరోపణలు చేశారు. ఇటీవల భాజపాలో చేరిన ఆమె తాజాగా ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని ఓ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దుశ్చర్యను ఖండిస్తూ ఇటీవల విశాల్‌ ట్వీట్‌ చేశారు. విశాల్‌ ట్వీట్‌పై స్పందిస్తూ గాయత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

‘‘సినిమా పరిశ్రమలో ఉన్న మీరు... అందులో జరుగుతున్న లైంగిక దాడులను ఖండించండి. ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న నటీమణులు, కథానాయికలపై లైంగిక దాడులు, వేధింపులు జరుగుతున్నాయి. మీ అవసరాల కోసం మహిళల్ని వాడుకుని చివరికి వాళ్లని అవతలకి విసిరిపారేస్తారు. మీ లాంటి వల్ల ఎంతో మంది మహిళలు మోసపోయారు. అలాగే వేధింపుల కారణంగా ఎంతోమంది హీరోయిన్స్‌ పారిపోయారు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. మీరు సినిమాల్లో చూపించే హీరోయిజం... పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలను ఆదుకోవడంలోనూ చూపించండి’’ అంటూ విశాల్‌ను ట్యాగ్‌ చేసి గాయత్రి ట్వీట్‌ చేసింది. దీంతో ఇప్పుడు ఆ ట్వీటు చర్చనీయాంశంగా మారింది. దీనిపై విశాల్‌ నుంచి గానీ, ఆయన టీమ్‌ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని