Naresh: ఆ వివాదంతో ‘మా’కు సంబంధం లేదు.. అందుకే స్పందించలేదు: నరేశ్
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని ఒకట్రెండు పార్టీలు ఆహ్వానించాయని, కానీ తనకు రావటం ఇష్టం లేదని సినీ నటుడు నరేశ్(Naresh) అన్నారు.
హైదరాబాద్: సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్య, వివాదం విషయంలో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)కు సంబంధం లేదని, అది కేవలం ‘మా’ సభ్యుల సంక్షేమం కోసమే ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ అని సినీ నటుడు నరేశ్(Naresh) అన్నారు. సినీ పరిశ్రమ, ముఖ్యంగా ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను నిరంతరం కష్టపడతానని స్పష్టంచేశారు. నటుడిగా, నిర్మాతగా మరింత ముందుకు వెళ్లాలని ఉందని అన్నారు. జనవరి 20న నరేశ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రమేశ్బాబును కోల్పోవడం, కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని తెలిపారు.
‘‘పండంటి కాపురం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశా. ఈ ఏడాదితో నేను సినీ కెరీర్ను మొదలు పెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్ని సంవత్సరాల ప్రయాణం చాలా అరుదు. అందుకు కృష్ణ గారు, విజయ నిర్మలగారితో పాటు, మా గురువు జంధ్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంతేకాదు, నా కెరీర్లో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు నన్ను ప్రోత్సహించారు. నటుడిగా కొనసాగుతూనే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించా. భాజపాతో పాటు కలిసి ప్రయాణం చేసి ఉన్నత పదవుల్లో ఉన్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు నా వంతు బాధ్యత నిర్వహించా. ఇప్పటికీ బిజీ యాక్టర్గా కొనసాగుతున్నా. అందుకు సినీ పరిశ్రమకు, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ప్రభుత్వం అందించే పథకాలు సినీ పరిశ్రమలో అర్హులైన వారికి అందేలా నా వంతు ప్రయత్నం చేస్తా’’
‘‘సెకండ్ ఇన్నింగ్స్లో యువ దర్శకులందరూ నాకు మంచి పాత్రలు ఇచ్చారు. గతేడాది విజయం సాధించిన ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించా. ఈ ఏడాది మరికొన్ని కొత్త పాత్రలు పోషిస్తున్నా. వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తున్నా. విజయకృష్ణ మూవీస్, విజయకృష్ణ ఎంటర్టైన్ ద్వారా సినిమాలు, వెబ్సిరీస్లు నిర్మిస్తాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వివిధ పదవుల్లో పనిచేశా. వెల్ఫేర్ కోసం ‘మా’లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశా. అదే గత ఎన్నికల్లో మాకు విజయాన్ని అందించింది. ‘మా’కు ఒకసారే అధ్యక్షుడిగా పోటీ చేస్తానని గతంలో చెప్పా. ఒకవేళ భవిష్యత్లో పోటీ చేసినా, ఇండస్ట్రీ బిడ్డగా, ‘మా’ సభ్యులకు సహకారం అందిస్తా’’
‘‘సినీ పరిశ్రమలో నష్టపోయేవారే ఎక్కువమంది ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తుంటారు. ఇతర రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా సమస్యలు ఉంటాయి. దీనిపై పెద్దలందరూ చర్చలు జరుపుతున్నారు. నేను ఆ వివాదంలోకి వెళ్లదలుచుకోలేదు. సినీపరిశ్రమ-ప్రభుత్వం కలిసి ఒక మంచి నిర్ణయానికి వస్తాయని అనుకుంటున్నా. ఇటీవల చిరంజీవిగారు కూడా సీఎం జగన్ను కలిశారు. ఈ విషయంలో ‘మా’ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘మా’ అనేది ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది. ఛాంబర్లో ఒక భాగం మాత్రమే. వాళ్ల వరకే మా బాధ్యత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని నా అభిప్రాయం. కొవిడ్ ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో ‘మా’ సభ్యుల సంక్షేమమే మాకు ముఖ్యం. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఛాంబర్ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగారిని కలుస్తుందని భావిస్తున్నా. పదవులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చేసేందుకు చాలా మంది ఉన్నారు. ఒక నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా సామాజిక కార్యకర్తగా ముందుకు సాగుతా. వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. నాకు వెళ్లాలని లేదు’’ అని నరేశ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ