ప్రేక్షకులు ముందుకు రావాల్సిన సమయం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘99 సాంగ్స్’. ఈహాన్ భట్, ఎడిల్సీ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో హీరో పాత్రకు నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘99 సాంగ్స్’. ఈహాన్ భట్, ఎడిల్సీ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో హీరో పాత్రకు నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి రెహమాన్ మాట్లాడుతూ..‘‘ఒక చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే చిత్రసీమపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ విజయం మొత్తం చిత్రసీమదిగా భావిస్తారు. ప్రజలు చిత్రనిర్మాతలను ప్రోత్సహించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఒక సినిమా చతికిల పడితే ఈ రంగంపై జీవనోపాధి పొందుతున్న వారు తమ ఉపాధిని కోల్పోతారు. కొంతమందయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు ధైర్యంగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్రేక్షకులు మాస్కులు ధరించి, అన్నీ జాగ్రత్తలు తీసుకొని వస్తారని, సురక్షితంగా ఉంటూ సినిమాను ఆస్వాదించాలని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. ఐడియల్ ఎంటర్టైన్మెంట్, వైఎమ్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జియో స్టూడియోస్ పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. చిత్రంలో లిసా రే, మనీషా కొయిరాలా, ఆదిత్య సీల్, రంజిత్ బారోట్, రాహుల్ రామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.