సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన తొలి జానపద గీతం!

ప్రస్తుత సినిమాల్లో ఒక హిట్‌ సాంగ్‌ ఉందంటే అది సిథ్‌ శ్రీరామ్‌ పాడి ఉండొచ్చనడంలో అతిశయోక్తి లేదు. చిన్న సినిమాలకు సైతం ఆయన గాన మాధుర్యంతో విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. ఆ  క్రమంలోనే ‘నల్లమల’ అనే చిత్రంలో ‘ఏమున్నావే

Published : 13 Feb 2021 16:42 IST


హైదరాబాద్‌: ప్రస్తుత సినిమాల్లో ఒక హిట్‌ సాంగ్‌ ఉందంటే అది సిధ్‌ శ్రీరామ్‌ పాడి ఉండొచ్చనడంలో అతిశయోక్తి లేదు. చిన్న సినిమాలకు సైతం ఆయన గాన మాధుర్యంతో విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. ఆ క్రమంలోనే ‘నల్లమల’ అనే చిత్రంలో ‘ఏమున్నావే పిల్లా..ఏమున్నావే’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు. తాజాగా విడుదలైన లిరికల్‌ వీడియో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సాంగ్‌తో శ్రీరామ్‌ మొదటిసారి జానపద గీతాన్ని ఆలపించటం ప్రత్యేకత. సంగీత దర్శకుడు పీఆర్‌ స్వయంగా గీతాన్ని రచించి, బాణీలు కట్టారు. రవిచరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమిత్‌ తివారి, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు నటిస్తున్నారు. నమో క్రియేషన్స్‌పై ఆర్‌ఏం అనే ప్రొడ్యూసర్‌ నిర్మిస్తున్నారు. మరి లేటెందుకు ఆ జానపద గీతాన్ని మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!

ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని