Suriya: తొలి షెడ్యూల్‌ పూర్తి

విభిన్నమైన సినిమాల దర్శకుడు బాలాతో కథానాయకుడు సూర్య  ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి కథానాయిక. కన్యాకుమారిలో 35 రోజులుగా జరుగుతున్న ఈ చిత్ర

Updated : 05 May 2022 08:50 IST

విభిన్నమైన సినిమాల దర్శకుడు బాలాతో కథానాయకుడు సూర్య  ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి కథానాయిక. కన్యాకుమారిలో 35 రోజులుగా జరుగుతున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయినట్లు ప్రకటించారు. మరో షెడ్యూల్‌ను జూన్‌ నుంచి పట్టాలెక్కించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇందుకోసం గోవాలో భారీ సెట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఓ పాత్రలో మత్స్యకారుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. 20 ఏళ్ల తర్వాత బాలా, సూర్య కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. దీనికి జి.వి ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని