Ranga Ranga Vaibhavanga: తెలుసా తెలుసా.. ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో

వైష్ణవ్‌ తేజ్‌, కేతిక శర్మ జంటగా గిరీశాయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు.

Updated : 04 Feb 2022 07:20 IST

వైష్ణవ్‌ తేజ్‌, కేతిక శర్మ జంటగా గిరీశాయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవతారో’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు శ్రీమణి సాహిత్యమందించగా.. శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. పాటలో వైష్ణవ్‌, కేతికల జంట చూడముచ్చటగా కనిపించింది. ‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమా ఉంటుంది. వైష్ణవ్‌, కేతికల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేవిశ్రీ సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తుంది’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని