Manchu Lakshmi: ఎట్టకేలకు నెరవేరిన మంచు లక్ష్మి కల.. ట్విటర్‌లో ఆనందం

వ్యాఖ్యాతగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి.

Published : 13 Feb 2022 01:14 IST

హైదరాబాద్‌: వ్యాఖ్యాతగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తుంటారు. అయితే, ఎన్నో ఏళ్లుగా ఆమె కన్న కల నిజమైందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. మోహన్‌బాబు తనయగా ఇండస్ట్రీకి పరిచయమైనా ఇప్పటివరకూ ఆయనతో కలిసి నటించే అవకాశం మంచు లక్ష్మికి రాలేదు. త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ ప్రజోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. మహిళా దర్శకురాలు నందినీరెడ్డి ముహూర్త సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.  డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి క‌థ‌, మాటలు అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని