‘గాలి సంపత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్‌రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర

Updated : 27 Feb 2021 13:11 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ ఎస్.ఎస్‌. రాజమౌళి విడుదల చేశారు. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కేవలం ‘ఫిఫీ’ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం. ఆ క్రమంలో కమెడియన్‌ సత్యతో హాస్య సన్నివేశాలు బాగా పండాయి. అలాగే కొడుకుపాత్రలో నటిస్తున్న శ్రీవిష్ణు ‘నేను కూడా మా నాన్నను కాస్త ఓపిగ్గా, ప్రేమగా అడగాల్సింది సార్‌’ అని చెప్తున్న డైలాగ్ వాళ్లిద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తుంది.

ఇందులో రాజేంద్రప్రసాద్‌ ఒక పత్యేక పరిస్థితుల్లో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. చివర్లో తనికెళ్ల భరణి ‘ప్రకృతికి ఏం తెలుసు ఎవరు మంచోళ్లో, ఎవరో చెడ్డోళ్లో’అని అంటున్న మాటలు‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్లీసింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు స్వరాలు సమకూరుస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌, ఇమేజ్‌ స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న థియేటర్లలోకి సినిమా రానుంది. మరి లేటెందుకు ఆ ట్రైలర్‌  మీరు చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని