మార్చి 19న ఓటీటీలో ‘గాలి సంపత్‌’

శివరాత్రి కానుకగా విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ‘గాలి సంపత్‌’ ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు వస్తున్నాడు. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధానపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యువ డైరెక్టర్‌ అనీశ్‌కృష్ణ తెరకెక్కించారు.

Updated : 19 Mar 2021 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివరాత్రి కానుకగా విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ‘గాలి సంపత్‌’ ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు వస్తున్నాడు. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యువ డైరెక్టర్‌ అనీశ్‌ కృష్ణ తెరకెక్కించారు. లవ్‌లీసింగ్‌ హీరోయిన్‌. తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లే చూసుకోవడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇమేజ్‌ స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, షైన్‌ స్క్రీన్స్ పతాకంపై ఎస్‌.కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహు, గారపాటి సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో మార్చి 19న విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ‘ఆహా’ పంచుకుంది. అదేరోజు ‘ఆహా’లో ‘క్షణ క్షణం’ కూడా విడుదల కానుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని