గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు ఏలిన రాజ్యం..
సాధారణ గీతాలు రాయడం ఓ ఎత్తు.. ప్రముఖుల గురించి సాహిత్య రూపంలో చెప్పడం మరో ఎత్తు. జాతిపిత మహాత్మ గాంధీ గురించి చెబుతూ.. ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపడం సవాలుతో కూడుకున్న పనే. వాటిని స్వీకరించి.. గాంధీతత్వాన్ని సినీ సాహిత్యంలో బోధించారు కొందరు గేయ రచయితలు. గాంధీ బాట ఇదని.....
సాధారణ గీతాలు రాయడం ఓ ఎత్తు.. ప్రముఖుల గురించి సాహిత్య రూపంలో చెప్పడం మరో ఎత్తు. జాతిపిత మహాత్మ గాంధీ గురించి చెబుతూ.. ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపడం సవాలుతో కూడుకున్న పనే. వాటిని స్వీకరించి.. గాంధీతత్వాన్ని సినీ సాహిత్యంలో బోధించారు కొందరు గేయ రచయితలు. గాంధీ బాట ఇదని తెలుగు ప్రజలకు వివరించి చైతన్యం నింపేందుకు పలువురు తెలుగు నటీనటులు, సంగీత దర్శకులు, దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా.. వెండితెరపై బాపూజీ గొప్పతనం గురించి వచ్చిన తెలుగు చిత్రాల్లోని కొన్ని పాటల్ని స్మరించుకుందాం...
గాంధీ పుట్టిన దేశం..
బాపు గొప్పతనం గురించి చెప్పే పాటల్లో ‘గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు ఏలిన రాజ్యం..’ ప్రముఖంగా నిలుస్తుంది. ‘ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం.. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి’ అని సాగే చరణం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది ఈ పాటలోని ప్రతి పదం మధురమే. మైలవరపు గోపీ సాహిత్యంలో జాలువారిన ఈ స్ఫూర్తి గీతాన్ని సుశీల ఆలపించారు. కోదండపాణి స్వరాలు సమకూర్చారు.
కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ..
శ్రీకాంత్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మహాత్మ’. ఇందులోని ‘రఘుపతి రాఘవ రాజారాం’ అంటూ సాగే పాట ప్రతి భారతీయుడ్ని ఆలోచింపజేసింది. గాంధీ గొప్పతనాన్ని చాటి చెప్పే గీతాల్లో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ‘గాంధీ అంటే కొందరి సొంతపేరు కాదు, గాంధీ అంటే వీధి పేరు కాదు.. గాంధీ అంటే కరెన్సీ నోటు మీద చూసే బొమ్మ కాదు.. గాంధీ అంటే భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ..’ అని హిత బోధ చేస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంతో, దివంగత గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో.. ప్రేక్షకుల్లో దేశభక్తి నింపారు.
ఓ బాపూ నువ్వే రావాలి..
ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘శంకర్దాదా జిందాబాద్’. గాంధీ మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా చిరంజీవి కనిపించి.. స్ఫూర్తినింపారు. ఇందులో ‘ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విధ్వంసాలను ఆపడం ఎవరి తరం కాదు.. అందుకే నువ్వే రావాలి, హింసను నువ్వు మాత్రమే ఆపగలవు.. అందుకే నీ సాయం మళ్లీ కావాలి అని రచయిత సుద్దాల అశోక్తేజ చైతన్యవంతమైన సాహిత్యం అందించారు. అదే స్థాయిలో ఈ పాటను ఆలపించి గాంధీపై ప్రేమను పంచుకున్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్.
జరుపుతోంది జరుపుతోంది భారతజాతి..
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడుగా వచ్చిన చిత్రం ‘నేటి గాంధీ’. ఇందులో గాంధీ జయంతి గురించి చెప్పే ఓ అపూర్వమైన పాట ఉంది. అదే ‘జరుపుతోంది జరుపుతోంది భారతజాతి’. దేశంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందీ పాట. ‘కళ్లను మూయక.. కాళ్లను కదపక.. వీధి వీధిన నిలిచి చూడమంటోంది జాతిపితని.. తను సాధించిన ప్రగతి..మన స్వర్ణ స్వతంత్ర భారతి.. పడతి ఒంటరిగ కనపడితే పగలే నడిరేయవుతుంది.. పశువాంఛలతో బుసకొడుతుంది..’ చరణాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలకు ప్రతిబింబాలు. ఈ పాటలో గాంధీ పుట్టిన రోజు గురించి చెప్తూనే మన మధ్య ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని ఆపడానికి బాపు మళ్లీ జన్మించాలని కథానాయిక రాశీ కోరుకుంటారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఇవి సైతం..
* జగపతి బాబు, ప్రేమ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మా ఆవిడ కలెక్టర్.’ ఇందులో జాతీయ జెండాపై ఓ గీతం ఉంది. వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో రూపొందిన పాట. ఇందులో గాంధీ గొప్పతనం కనిపిస్తుంది.
* నందమూరి తారక రామారావు, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. ఇందులోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో ‘గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే ధృవతారలు కన్నది ఈ దేశం. గాంధీ గురించి ఇలా రచయిత రాశారు జాలాది రాజారావు...’. కీరవాణి సంగీతం అందించగా బాలు ఆలపించి ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపారు.
* సమకాలిన సామాజిక పరిస్థితులు చూసి బాపు కన్న దేశమేనా ఇది అనే బాధ అందరిలోనూ ఉంటుంది. ఈ విషయాన్నే సాహిత్యంలో వినిపించారు ఆనాటి సినీ కవి. ‘గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది’ అంటూ వచ్చిన ‘పవిత్ర బంధం’లోని ఈ గీతం ఇప్పటికీ ఆలోచింపజేస్తుంది. అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడుగా మధుసూధనరావు తెరకెక్కించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..