Ganesh Acharya: ‘ఊ అంటావా’ కొరియోగ్రఫీ చేయనని చెప్పా: గణేశ్‌ మాస్టర్‌

సెన్సేషనల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’కి మొదట తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పానని ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య అన్నారు. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఈ పాటకు...

Updated : 08 Dec 2022 17:04 IST

ముంబయి: సెన్సేషనల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’కి మొదట తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పానని ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య తెలిపారు. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఈ పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన పలు విషయాలను గణేశ్‌ పంచుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

‘‘పుష్ప’ సినిమా డిసెంబర్‌ 17న విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో ఉన్న ‘ఊ అంటావా’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే, ఈసినిమా విడుదల కావడానికి ముందు డిసెంబర్‌ 2న అల్లు అర్జున్‌ నాకు ఫోన్‌ చేశారు. ‘మాస్టర్‌..  మా సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌కి మీరు కొరియోగ్రఫీ చేయాలి’ అని అడిగారు. అప్పటికే నేను కంటిశుక్లాలకు సర్జరీ చేయించుకోవడానికి వైద్యుడి వద్ద అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. దాంతో.. ‘ఏం అనుకోవద్దు బన్నీ.. నేను చేయలేను. ఎందుకంటే నాకు రేపే సర్జరీ ఉంద’ని చెప్పడంతో.. ఆ చిత్ర నిర్మాతలు మా డాక్టర్‌తో మాట్లాడి నా సర్జరీ డేట్‌ని మరో రోజుకి మార్చేలా చేశారు. అలా, నేను ఈ పాటకు కొరియోగ్రఫీ చేయగలిగాను. మొదటి రెండు రోజులపాటు రిహార్సల్స్‌ చేశాం. దీనికి ఇంత క్రేజ్‌ వచ్చిందంటే నా కొరియోగ్రఫీ ఒక్కటే కాదు.. సమంత-బన్నీ హార్డ్‌ వర్క్‌ కూడా ఉంది. ఈ పాటలో వాళ్లిద్దరి నటనకు అందరూ కనెక్ట్‌ అయ్యారు’’ అని గణేశ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని