Cinema News: ‘మహాసముద్రం’లో కేజీఎఫ్‌ విలన్‌

శర్వానంద్‌, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహాసముద్రం’లో ప్రతినాయకుడి పాత్రను ఎవరు పోషించనున్నారో

Published : 26 Jun 2021 14:29 IST

హైదరాబాద్‌: శర్వానంద్‌, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహాసముద్రం’లో ప్రతినాయకుడి పాత్రను ఎవరు పోషించనున్నారో తెలియజేస్తూ శనివారం చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘కేజీఎఫ్‌’లో గరుడగా మెప్పించిన రామ్‌, ఇందులో ధనుంజయ్‌గా తన విలనిజాన్ని ప్రదర్శించనున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదితిరావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ పనులు లాక్‌డౌన్ కారణంగా కొన్నిరోజుల క్రితం వాయిదా పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని