Manjima Mohan-Gautham: యువనటితో నటుడు సహజీవనం..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’తో వెండితెరకు పరిచయమైన నటుడు గౌతమ్ కార్తిక్. కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తిక్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమ్.. మొదటి సినిమాతోనే ప్రముఖుల...
త్వరలో ప్రకటన
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’తో వెండితెరకు పరిచయమైన నటుడు గౌతమ్ కార్తిక్. కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తిక్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమ్.. మొదటి సినిమాతోనే ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కెరీర్లో సూపర్హిట్ అందుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ కార్తిక్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్ట్టింట్లో వైరల్గా మారింది. గౌతమ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారట. అది కూడా ఓ యువ నటిని ఆయన పెళ్లాడనున్నారట. ఇంతకీ ఆ నటి ఎవరంటే మంజిమా మోహన్.
బాలనటిగా కెరీర్ ఆరంభించి ‘సాహసం శ్వాసగా సాగిపో’తో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్.. 2019లో గౌతమ్ హీరోగా తెరకెక్కిన ‘దేవరాట్టం’ (Devarattam) చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమకు దారి తీయడంతో వీరిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ పెద్దలకు తెలియడంతో వాళ్లు కూడా పెళ్లికి అంగీకారం తెలిపారట. దీంతో ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగే అవకాశం ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్