Bhediya: ‘కాంతార’ విజయోత్సాహం.. మరో డబ్బింగ్‌ చిత్రాన్ని తీసుకొస్తున్న‘గీతా ఫిల్మ్’

వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ‘బేడియా’, విష్ణు విశాల్‌ ‘మట్టి కుస్తీ’ సినిమాల అప్‌డేట్లు ఇవీ..

Published : 02 Nov 2022 15:48 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ (Geetha Film Distributors) సంస్థ మరో డబ్బింగ్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. ఈ సంస్థ తెలుగులో పంపిణీ చేసిన కాంతారా చిత్రం ఘనవిజయం అందుకుంది. ఆ విజయోత్సాహంతో.. హిందీలో తెరకెక్కిన ‘బేడియా’ (Bediya)ను తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైంది. వరుణ్‌ధావన్‌, కృతి సనన్‌ జంటగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో తోడేలు కాటుకు గురైన భాస్కర్‌ అనే పాత్రలో వరుణ్‌ నటించగా, కృతి సనన్‌.. అనిక అనే వైద్యురాలిగా కనిపిస్తుంది. నవంబరు 25న ఈ సినిమా 2డీ, 3డీ వెర్షన్లలో విడుదలకానుంది.

విశాల్‌ కుస్తీ

టాలీవుడ్‌ హీరో రవితేజ సమర్పణలో తమిళ నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal) హీరోగా ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi) అనే సినిమా తెరకెక్కుతోంది. చెల్లా అయ్యావు దర్శకుడు. ఈ చిత్రంలోని కథానాయకుడి ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విశాల్‌.. కుస్తీకి సిద్ధమవుతున్నట్టు కనిపించారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని