Genelia : నటి జెనీలియా సినిమాల్లోకి రీఏంట్రీ

‘‘ హ హ హాసిని,  వీలైతే నాలుగు  మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ అంటూ బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి జెనీలియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించనున్నారు. 2012లో నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన అనంతరం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె.. పదేళ్ల అనంతరం తెరపై సందడి చేయనున్నారు.

Published : 09 Dec 2021 01:44 IST

మరాఠీ చిత్రం ‘వేద్’తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ షురూ

ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్న భర్త, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘  వీలైతే నాలుగు  మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ అంటూ బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి జెనీలియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించనున్నారు. 2012లో నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన అనంతరం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె.. పదేళ్ల అనంతరం తెరపై సందడి చేయనున్నారు. ఆ మధ్య నాలుగు చిత్రాల్లో అతిథి పాత్రలకే పరిమితమైన జెనీలియా.. ఈసారి పూర్తిస్థాయి పాత్రతో ఓ మరాఠీ చిత్రంతో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని గురువారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు.

‘‘ మీ అందరి ఆశీర్వాదంతో వివిధ భాషల్లో నటించి ప్రేమ, గౌరవాన్ని పొందాను. మహారాష్ర్టలో పుట్టిన నేను.. ఇప్పటి వరకూ మరాఠీ చిత్రాల్లో నటించలేకపోయా. పదేళ్ల విరామం తరువాత మరాఠీ చిత్రం  ‘వేద్‌’లో నటించి నా కలను నిజం చేసుకుంటున్నా. నా భర్త, నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారనున్నారు. మా ప్రొడక్షన్‌ హౌస్‌ ముంబయి ఫిల్మ్‌కంపెనీ  నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి జియాశంకర్‌తో  కలిసినటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నా. 2022 ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని పోస్ట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని