నేనూ కరోనా బారిన పడ్డా: జెనీలియా

ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాలతో అలరించిన కథానాయిక జెనీలియా. ‘బాయ్స్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ‘సాంబ’, ‘సై’, ‘ఢీ’, ‘

Published : 30 Aug 2020 01:51 IST

ముంబయి: ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాలతో అలరించిన కథానాయిక జెనీలియా. ‘బాయ్స్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ‘సాంబ’, ‘సై’, ‘ఢీ’, ‘బొమ్మరిల్లు’, ‘సత్యం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘బొమ్మరిల్లు’లో హాసినగా ఆమె నటన ఎవర్‌గ్రీన్‌. కాగా, తాజాగా ఆమె కరోనా బారినపడినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘‘మూడు వారాల కిందట నేను కరోనా బారినపడ్డా. నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. దేవుడి దయవల్ల ఈ రోజు చేసిన పరీక్షల్లో నాకు నెగటివ్‌ వచ్చింది. నేను సులభంగానే కరోనాను జయించాను. అయితే, ఈ 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండటం నాకు సవాల్‌గా అనిపించింది. వీడియో కాల్స్‌, డిజిటల్‌ సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో నాకు ఒంటరితనం అనేది అనిపించలేదు. ఇప్పుడు నా ప్రియమైన కుటుంబాన్ని కలుసుకున్నా. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఏదైనా సమస్య అనిపిస్తే, వెంటనే పరీక్ష చేయించుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. దృఢంగా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాటానికి ఇదే మార్గం మీ జెనీలియా’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని