ప్రతినాయకురాలిగా అనసూయ?
బుల్లితెర వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. అంతేకాదు, అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా గుర్తిండిపోయే పాత్రను చేశారు. ఇక ఈ ఏడాది పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అందులో ఒకటి ప్రతినాయకురాలిగా నటించబోతున్నారట.
హైదరాబాద్: బుల్లితెర వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. అంతేకాదు, అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా గుర్తిండిపోయే పాత్రను చేశారు. ఇక ఈ ఏడాది పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అందులో ఒకటి ప్రతినాయకురాలిగా నటించబోతున్నారట.
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ చిత్రంలో అనసూయకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఆమె విలన్గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ప్రతినాయకులురాలికి నాయకుడు ఎవరో చూడాలి మరి. గతేడాది తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది అనసూయ. ప్రస్తుతం సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పవన్-క్రిష్ల చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..