ప్రతినాయకురాలిగా అనసూయ?

బుల్లితెర వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. అంతేకాదు, అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా గుర్తిండిపోయే పాత్రను చేశారు. ఇక ఈ ఏడాది పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అందులో ఒకటి ప్రతినాయకురాలిగా నటించబోతున్నారట.

Published : 18 Feb 2020 11:22 IST

హైదరాబాద్‌: బుల్లితెర వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. అంతేకాదు, అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా గుర్తిండిపోయే పాత్రను చేశారు. ఇక ఈ ఏడాది పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అందులో ఒకటి ప్రతినాయకురాలిగా నటించబోతున్నారట.

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నిర్మించనున్న ఓ చిత్రంలో అనసూయకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఆమె విలన్‌గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ప్రతినాయకులురాలికి నాయకుడు ఎవరో చూడాలి మరి. గతేడాది తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది అనసూయ. ప్రస్తుతం సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పవన్‌-క్రిష్‌ల చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని