కరోనాపై అమితాబ్‌ కవిత..!

ముంబయి: ప్రపంచదేశాలతో పాటు భారత్‌ను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు.

Updated : 13 Mar 2020 14:07 IST

ముంబయి: ప్రపంచదేశాలతో పాటు భారత్‌ను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే తాను స్వయంగా రాసిన ఓ కవితను వినిపిస్తున్న వీడియోని ట్విటర్‌లో పోస్టుచేశారు. ప్రజలు చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఉసిరి, కలోంజి రసాలను సేవించాలని సూచించారు. 

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కూడా కరోనాపై ఇన్‌స్టాగ్రాంలో స్పందించారు. ప్రజలు ఎదుటివారిని పలకరించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ నమస్తే పెడుతున్న ఫోటోలను షేర్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు