అందుకే వేర్వేరుగా ఉంటున్నాం: శృతిహసన్
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో అందరూ గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని పదేపదే చెబుతోంది...
ముంబయి: కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో అందరూ గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని పదేపదే చెబుతోంది. అయినా కొంతమంది మాత్రం యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబం మొత్తం క్వారంటైన్లోకి వెళ్లడానికి గల కారణాలను హీరోయిన్ శృతిహసన్ వెల్లడించింది. గత పది రోజుల క్రితం లండన్ నుంచి ముంబయి వచ్చిన శృతిహసన్, తండ్రి కమల్హసన్, తల్లి సారిక, సోదరి అక్షరహసన్ సైతం క్వారంటైన్లోకి వెళ్లారు. అయితే, అందరూ ఒకే ఇంట్లోకి వెళ్లకుండా వేర్వేరు ఇళ్లలో నిర్బంధం విధించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే, ఇలా వేర్వే ఇళ్లలో క్వారంటైన్ కావడానికి గల కారణాలు ఆమె వెల్లడించింది.
‘కరోనా గురించి ప్రజలంతా భయపడుతున్నారు. వైరస్ భయం మాలోనూ ఉంది. అందుకే మా కుటుంబం మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో సామాజిక దూరం గురించి మాట్లాడుతున్నప్పుడు అతని చుట్టూ మరో ఐదుగురు వ్యక్తులు ఉండటం గమనించాను. ఇంకో వ్యక్తి తన స్నేహితుడిని కలవాలని అంటుంటే విన్నాను. ఇలాంటి సమయంలో చదువుకున్నవాళ్లే ఇలా బాధ్యత లేనట్లుగా వ్యవహరించడం సరికాదు. విద్యావంతులు మరింత బాధ్యతగా ఉండాలి. మేం బాధ్యతాయుతంగా ఉండాలనుకున్నాం. అందుకే నాన్న, చెల్లి చెన్నైలో ఉండగా అమ్మ, నేను ముంబయిలో వేర్వేరుగా క్వారంటైన్లో ఉన్నాం’ అని ఆమె పేర్కొన్నారు.
‘క్వారంటైన్లో నేను నాలా ఉండాలని అనుకుంటున్నా. ఇందులో కష్టమైన విషయం ఏంటంటే బయటకు వెళ్ళడానికి అవకాశం లేకపోవడమే. అయితే, మీరు మీతో సమయం గడపలేకపోతే మీరు ఎవరికీ మంచి కంపెనీ ఇవ్వలేరని అర్థం. అందుకే నాకు నేను కంపెనీ ఇవ్వాలని నిశ్చయించుకొని ఒంటరిగా నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు ఇంట్లో ఎవరూ లేరు. సహాయకులు కూడా లేరు. నా వంట నేనే చేసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా తనకు బాగా ఇష్టమైన వంట, ఇతర పనులను తానే చేసుకుంటున్నట్లు ఆమె తన అభిమానులతో పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి