స్నేహ ఇంటి కరెంట్ బిల్లు @42 వేలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్ బిల్లు చెల్లించడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని.. వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే బాగుంటుందని నటి స్నేహా భర్త ప్రసన్న కోరారు. తాజాగా ఆయన ఇంటికి....
ట్వీట్ చేసిన నటి భర్త.. స్పందించిన టీఎన్ఈబీ
చెన్నై: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్ బిల్లు చెల్లించడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని.. వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే బాగుంటుందని నటి స్నేహ భర్త ప్రసన్న కోరారు. తాజాగా ఆయన ఇంటికి రూ.42 వేలు కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై స్పందిస్తూ ‘లాక్డౌన్ సమయంలో టీఎన్ఈబీ(తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్) మనల్ని దోచుకుంటోందని ఎంతమంది భావిస్తున్నారు?’ అని ఓ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించి ‘లాక్డౌన్ సమయంలో టీఎన్ఈబీ కరెంట్ బిల్లులను ఎక్కువ మొత్తంలో విధిస్తోంది’ అంటూ కామెంట్లు పెట్టారు.
కాగా, ప్రసన్న పెట్టిన ట్వీట్పై తాజాగా టీఎన్ఈబీ స్పందించింది. ‘ప్రసన్న.. మార్చి నెల నుంచి మీరు కరెంట్ బిల్లును చెల్లించలేదు. అలా ఈ నాలుగు నెలలకు గాను మీరు చెల్లించాల్సిన మొత్తం కరెంట్ బిల్లు రూ.42,632. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా మీటర్ రీడింగ్ తీయడం లేదని మేము ముందే వెల్లడించాం. అందుకు అనుగుణంగానే ముందు నెలలో ఎంత బిల్లు వచ్చిందో.. అదే మొత్తాన్ని మార్చి నెలలో చెల్లించమని కోరాం’ అని టీఎన్ఈబీ పేర్కొంది.
టీఎన్ఈబీ ట్వీట్పై ప్రసన్న స్పందిస్తూ.. ‘వ్యక్తిగతంగా ఆ మొత్తాన్ని చెల్లించడం నాకు సమస్య కాదు. మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించేశాను. కరెంట్ బిల్లు కట్టడంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియజేయాలని భావించాను. బిల్లులు చెల్లించడం విషయంలో ప్రభుత్వం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని ఆశిస్తున్నాను. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించేందుకు అంగీకరిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నేను చేసిన ట్వీట్తో మీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి.’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?