ఏపీలో షూటింగ్లకు అనుమతిచ్చారు: చిరు
ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జులై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చిరు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మంగళవారం సీఎం జగన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్బాబు, సి.కల్యాణ్, దిల్రాజు తదిరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎం జగన్తో వారు చర్చించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో సమావేశం అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో కలిసి ఏడాది కాలంగా సీఎం జగన్ను కలవాలని అనుకున్నాం. ఇప్పుడు కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే వచ్చాం. రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ రాణించడానికి వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపాం. లాక్డౌన్ సమయంలో షూటింగ్లు స్తంభించిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే షూటింగ్లకు అనుమతి ఇచ్చింది. జూన్ 15 తర్వాత చిత్రీకరణలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం జగన్కు దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు ఆయన్ను కలిశాం. అన్నింటినీ సీఎం జగన్ సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందుకు సంబంధించిన విధివిధానాలను మంత్రి నాని, ఇతర అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు’’
‘‘లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడి పునః ప్రారంభం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ల మినిమం పవర్ టారిఫ్లను రద్దు చేయాలని కోరాం. దాని కూడా సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఇక గత కొంతకాలంగా నంది అవార్డులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని ప్రతి నటుడు, టెక్నీషియన్ కోరుకుంటాడు. దీని కూడా 2019-20 సంబంధించిన అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ వేడుక కూడా ఈ ఏడాదే జరుగుతుందని ఆశిస్తున్నా. అలాగే టికెటింగ్లో పారదర్శకత ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు’’
‘‘చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో సినిమాను దాని బట్టి టికెట్ ధర పెరుగుతుంది. దీని వల్ల భారీ సినిమాలు తీసే నిర్మాతలకు మేలు జరుగుతుంది. ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం వైఎస్ హయాంలో విశాఖలో 300 ఎకరాలను కేటాయించారు. దాన్ని పునః పరిశీలిస్తానని చెప్పారు. ఏపీలో సినిమాలు నిర్మించాలి. అవుట్ డోర్ యూనిట్లు పెట్టాలనుకునేవాళ్లకు అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలను విని, సానుకూలంగా స్పందించిన సీఎం జగన్కు చిత్ర పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన వెంట మంత్రి పేర్ని నాని, నాగార్జున, రాజమౌళి, సురేశ్బాబు, దిల్రాజు, సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా!
నటుడు తిరువీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్