ఓటీటీ విప్లవం..చిన్న సినిమాలకు వరం
కరోనా వైరస్..ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుబోతున్నాయి. మరో పక్క ధియేటర్లు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుబోతున్నాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. భౌతిక స్పర్శ ద్వారా కరోనావైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో చిత్రీకరణలు ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లొకేషన్లలో అతి కొద్దిమంది మాత్రమే ఉండేలా చిత్ర బృందాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ బడ్జెట్తో, అతి కొద్దిమందితో చిత్రీకరణ చేయగలిగిన కథల అన్వేషణలో పడ్డారు దర్శక-నిర్మాతలు. కొందరు నిర్మాతలు ప్రత్యేకంగా ఓటీటీ(ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్)లో విడుదల చేసేలా సినిమాలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
సంక్షోభాన్ని సదావకాశంగా మలుచుకున్న ఓటీటీ..
టెక్నాలజీ, స్మార్ట్ఫోన్/టీవీ, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత యువత ఓటీటీలపై వైపు నెమ్మదిగా పయనించడం మొదలు పెట్టారు. ఈ పరిస్థితుల్లో కరోనా సంక్షోభం ఓటీటీ వేదికలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. లాక్డౌన్తో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెజాన్, నెట్ప్లిక్స్, ఆహా, సన్ నెక్స్ట్, డిస్నీ+ హాట్ స్టార్, జీ5, ఏటీఎల్ బాలాజీ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు తమ పరిధిని పెంచుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ప్రసారం అవుతున్న వెబ్సిరీస్లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం గరిష్ఠంగా పది ఎపిసోడ్ల చొప్పున ఒక్కో వెబ్సిరీస్ ప్రసారం అవుతోంది. 40 నిమిషాల నిడివి వరకు ఉండే ఈ వెబ్ సిరీస్లలో ఎక్కువగా క్రైమ్, హారర్, థ్రిల్లర్ జోనర్లలోనే సాగుతుండగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న బడ్జెట్ సినిమాలు, క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. కంటెంట్ను బట్టి రేటు బాగానే పలుకుతోంది. ఈ మధ్యనే జ్యోతిక నటించిన ‘పొన్మగళ్ వందాళ్’, అంతకుముందు తెలుగు చిత్రం ‘అమృతరామమ్’ ఓటీటీ వేదికగానే విడుదల అయ్యాయి. హిందీలో అమితాబ్, అయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’ త్వరలో అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. చిన్న చిత్రాలే కాక అధిక బడ్జెట్తో నిర్మితమైన జాన్వికపూర్ ‘గుంజన్ సక్సేనా’ కూడా ఓటీటీ బాటలో నడుస్తున్నాయి. అప్పులు తెచ్చి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు వడ్డీల భారం అధికమవుతుండటంతో వచ్చిన కాడికి బయటపడిపోతే మేలని భావిస్తున్నారు.
మరిన్ని మార్పులు
సగటు ప్రేక్షకుడి అభిరుచి మారుతుంది. భారీ స్థాయిలో ఉండే ఎలివేషన్ సీన్లు, మూస కథలను ఇష్టపడే వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. కథ హృదయానికి హత్తుకోవాలి. ఉద్వేగాన్ని కలిగించేలా, ఉత్కంఠను రేకేత్తించేలా చిత్రాలు ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దీంతో భాషాతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను ఆదరిస్తున్నారు. సినిమా బాగుంటే చాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, మరాఠీ అనే భేదం లేదు. సోషల్మీడియాలో ఫలానా చిత్రం బాగుందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఓటీటీలు సబ్ టైటిల్స్ రూపంలో అన్ని ప్రాంతాల భాషలను అందుబాటులో ఉంచడం కలిసొచ్చే విషయం. ఈ పరిణామం రచయితలు, దర్శకులు కావాలనుకునే వారికి స్వర్ణయుగంగా మారనుంది. అత్యంత పకడ్బందీగా కథా కథనాలు రాసుకుని, ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా చేసుకుంటే మంచి విజయం సాధించవచ్చు. బడ్జెట్ తక్కువలో ఉండటం, థియేటర్ల కొరత సమస్యలు లేకపోవటంతో నిర్మాతలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు.
‘‘ప్రస్తుతం తిరిగి షూటింగ్లు ఎలా మొదలుపెట్టాలన్నదానిపై చర్చిస్తున్నాం. ఓటీటీకి అమ్మేసుకునే చిత్రాల షూటింగ్లు మొదలు పెడితే మంచిది. అదే విధంగా టెలివిజన్ సిరీస్లు కూడా. ఎందుకంటే ఆ సినిమాను అమ్ముకునే అవకాశం ఉంది. ఎవరో ఒకరు కొంటారు. 50మందితో మాత్రమే షూటింగ్ చేయాలని అంటున్నారు. అది అస్సలు సాధ్యపడదు. మేము తీస్తున్న ‘నారప్ప’కోసం రోజుకు 100మంది జూనియర్ ఆర్టిస్ట్లు కావాలి. నా స్వార్థం కోసం నేను షూటింగ్ మొదలు పెట్టి, అందులో ఎవరికైనా కరోనా వస్తే, ఆ మచ్చ నాపై పడిపోతుంది. నా సినిమా పూర్తయినా కూడా ఇప్పుడే విడుదల చేసే పరిస్థితి మార్కెట్లో లేదు. ఇలాంటి సమయంలో తొందరపడకూడదని నేను అభిప్రాయపడుతున్నా’’
- దగ్గుబాటి సురేష్బాబు
‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచినా ఇంతకు మందులా ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువ. ప్రస్తుతం పరిస్థితులన్నింటిని గమనిస్తున్నాం. రాబోయే కాలంలో ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్కు సరిపడా సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతా’’
- చంటి అడ్డాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం