గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ప్రభాస్‌

హరితహారంలో భాగంగా తెరాస ఎంపీ సంతోష్‌కుమార్‌ విసిరిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ను ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పూర్తి చేశారు. తాజాగా స్టార్‌ హీరో ప్రభాస్‌ ఈ

Published : 12 Jun 2020 00:57 IST

హైదరాబాద్‌: హరితహారంలో భాగంగా తెరాస ఎంపీ సంతోష్‌కుమార్‌ విసిరిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ను ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పూర్తి చేశారు. తాజాగా తన పెదనాన్న విసిరిన ఈ ఛాలెంజ్‌ను స్టార్‌ హీరో ప్రభాస్‌ స్వీకరించి, మొక్కలు నాటారు. మూడో విడత ‘గ్రీన్‌ ఛాలెంజ్‌’లో భాగంగా గురువారం ప్రభాస్‌, ఎంపీ సంతోష్‌తో కలిసి తన గెస్ట్‌ హౌస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఇరువురు ఆ మొక్కలతో కలిసి సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. చాలా రోజు తర్వాత ఇలా అయినా, తమ అభిమాన కథానాయకుడిని చూసుకున్నందుకు అభిమానులు సంతోషపడుతున్నారు. 

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మూడో విడతను ప్రారంభించిన ప్రభాస్‌ ఈ సందర్భంగా వెయ్యి ఎకరాల రిజర్వ్‌ ఫారెస్టును దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను రానా, రామ్‌చరణ్‌, శ్రద్ధాకపూర్‌లకు ఇచ్చారు. కీసర అటవీ అభివృద్ధి తనలో స్ఫూర్తిని నింపిందని ప్రభాస్‌ తెలిపారు.


 

ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లాక్‌డౌన్‌కు ముందే విదేశాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ఓ సెట్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని