ముందు నాకు నచ్చితే సూర్యని కలుస్తా..!
కథానాయకుడు సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘24’. విభిన్నమైన కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా...
దర్శకుడు విక్రమ్ కుమార్
చెన్నై: కథానాయకుడు సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘24’. విభిన్నమైన కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘24’ సీక్వెల్పై దర్శకుడు విక్రమ్ కుమార్ స్పందించారు. ఆసక్తికరమైన కథ సిద్ధంకాగానే తప్పకుండా సీక్వెల్ చేస్తానని చెప్పారు.
‘‘24’ సినిమా విడుదలకు ముందే ఈ కథకు సీక్వెల్ చేస్తే బాగుంటుందని నేను, సూర్య అనుకున్నాం. ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా.. మరింత వినూత్నంగా, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేత్తించే విధంగా ఆ స్వీకెల్ ఉండాలని అనుకున్నాం. మంచి కథ, స్ర్కీన్ప్లే ఉన్నప్పుడు మాత్రమే ‘24’ సీక్వెల్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నేను స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నాను. నేను రాసిన స్ర్కిప్ట్ నాకు పూర్తి సంతృప్తినిస్తే సూర్యని కలుస్తాను’ అని విక్రమ్ తెలిపారు.
‘24’ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ ‘హలో!’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలను తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ‘గ్యాంగ్లీడర్’లో నాని కథానాయకుడిగా నటించారు. కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో మెప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు