ముందు నాకు నచ్చితే సూర్యని కలుస్తా..!

కథానాయకుడు సూర్య, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘24’. విభిన్నమైన కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా...

Published : 13 Jun 2020 02:21 IST

దర్శకుడు విక్రమ్‌ కుమార్‌

చెన్నై: కథానాయకుడు సూర్య, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘24’. విభిన్నమైన కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘24’ సీక్వెల్‌పై దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ స్పందించారు. ఆసక్తికరమైన కథ సిద్ధంకాగానే తప్పకుండా సీక్వెల్‌ చేస్తానని చెప్పారు.

‘‘24’ సినిమా విడుదలకు ముందే ఈ కథకు సీక్వెల్‌ చేస్తే బాగుంటుందని నేను, సూర్య అనుకున్నాం. ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా.. మరింత వినూత్నంగా, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేత్తించే విధంగా ఆ స్వీకెల్‌ ఉండాలని అనుకున్నాం. మంచి కథ, స్ర్కీన్‌ప్లే ఉన్నప్పుడు మాత్రమే ‘24’ సీక్వెల్‌ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నేను స్ర్కిప్ట్‌ సిద్ధం చేస్తున్నాను. నేను రాసిన స్ర్కిప్ట్‌ నాకు పూర్తి సంతృప్తినిస్తే సూర్యని కలుస్తాను’ అని విక్రమ్‌ తెలిపారు.

‘24’ సినిమా తర్వాత విక్రమ్‌ కుమార్‌ ‘హలో!’, ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రాలను తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ‘గ్యాంగ్‌లీడర్’లో నాని కథానాయకుడిగా నటించారు. కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో మెప్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని