‘పెదరాయుడు’ గురించి ఈ విశేషాలు తెలుసా?
భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుగు తెరపై ఆవిష్కృతమైన బ్లాక్బస్టర్ చిత్రాల్లో ‘పెదరాయుడు’ ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ మోహన్బాబు, సూపర్స్టార్ రజనీకాంత్ కీలకపాత్రల్లో...
బ్లాక్బస్టర్ చిత్రానికి పాతికేళ్లు..!
ఇంటర్నెట్డెస్క్: భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుగు తెరపై ఆవిష్కృతమైన బ్లాక్బస్టర్ చిత్రాల్లో ‘పెదరాయుడు’ ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ మోహన్బాబు, సూపర్స్టార్ రజనీకాంత్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటితో 25 ఏళ్లు అయ్యింది. పాపారాయుడిగా రజనీకాంత్ అద్భుత నటన, పెదరాయుడిగా మోహన్బాబు యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, భానుప్రియ, సౌందర్య అభినయం, కోటి అందించిన సంగీతం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సినిమాలో ఎన్నో విశేషాలు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెదరాయుడు’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..
తమిళనాడులో పుట్టిన కథ..!! కోలీవుడ్లో తెరకెక్కిన ‘నట్టమై’ చిత్రానికి రీమేక్గా తెలుగులో ‘పెదరాయుడు’ విడుదలయ్యింది. శరత్కుమార్ కథానాయకుడిగా 1994లో వచ్చిన ‘నట్టమై’ మంచి విజయాన్ని సాధించింది. అయితే, ఆ సినిమా చూసిన తర్వాత ఓ రోజు రజనీకాంత్.. మోహన్బాబుకి ఫోన్ చేసి ‘నట్టమై’ చూడమని, ఆ కథను తెలుగులో తెరకెక్కిస్తే విజయం సాధిస్తుందని తెలిపారు. స్నేహితుడి మాట మేరకు మోహన్బాబు వెంటనే ఆ చిత్రాన్ని చూసి కాపీ రైట్స్ కొనుగోలు చేశారు. అలా ‘పెదరాయుడు’ చిత్రానికి తొలి అడుగు పడింది. |
హిట్ చిత్రాల దర్శకుడు ‘ఎమ్.ధర్మరాజు ఎం.ఏ’ చిత్రం తర్వాత మోహన్బాబు, రవి రాజా పినిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. కాపీరైట్స్ కొనుగోలు చేసిన అనంతరం ఈ కథను రవిరాజా అయితే సరిగ్గా తెరకెక్కించగలరని మోహన్బాబు భావించారు. అలా ‘పెదరాయుడు’ డైరెక్షన్ రవిరాజాని వరించింది. నటీనటుల సంభాషణలు, హావభావాలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా డైరెక్టర్ కథలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సన్నివేశంలో కుటుంబ విలువలను చక్కగా చూపించారు. పాపారాయుడుగా రజనీకాంత్, పెదరాయుడుగా మోహన్బాబు అతని భార్య లక్ష్మిగా భానుప్రియ, పెదరాయుడు తమ్ముళ్లుగా మోహన్బాబు (రాజా), రాజా రవీంద్ర (రవీంద్ర) మెప్పించారు. అలాగే రాజా సతీమణిగా ధనవంతురాలైన అమ్మాయిగా సౌందర్య (భారతి) నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. |
కదిలించిన సంగీతం..!! కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేపథ్య సంగీతానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘బావవి నువ్వు భామని నేను’ అనే ప్రేమ గీతం, ‘కదిలే కాలమా’ అనే భావోద్వేగ భరితమైన పాట.. ఇలా ప్రతిదీ సూపర్ హిట్టే. కోటి అందించిన స్వరాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే సౌందర్య సీమంతం నేపథ్యంలో సాగే ‘కదిలే కాలమా’ అనే పాట మోహన్బాబు అభిరుచికి నిదర్శనం. ఎందుకంటే ఆయనే కావాలని ఆ పాటను సినిమాలో పెట్టించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రతి తెలుగింటిలోనూ ఈ పాట ఎంతగానో వినిపించింది. |
పారితోషికం లేకుండా..!! అన్నదమ్ముల అనుబంధం గురించి తెలియజేసే ఈ కథలో పెదరాయుడు నాన్న పాపారాయుడి పాత్ర కీలకమైనది. సినిమాలో ఈ పాత్ర నిడివి తక్కువ సమయమే అయినా కథకు మూలమిదే. మోహన్బాబు కాపీరైట్స్ కొనుగోలు చేసిన తర్వాత ‘పాపారాయుడు’ పాత్ర తాను చేస్తానని రజనీ తెలిపారు. నిడివి చాలా తక్కువ ఉంటుంది కదా వద్దు అని చెప్పినా సరే.. రజనీకాంత్ మాత్రం ఆ పాత్రలో ఒదిగిపోయారు. అయితే, పాపారాయుడిగా నటించినందుకు రజనీ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. |
బాక్సాఫీస్ వసూళ్లు..!! మామూలు చిత్రంగా తెరకెక్కిన ‘పెదరాయుడు’ విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో సూపర్హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజయవంతంగా 25 వారాలు ఆడింది. ఈ సినిమా 200 రోజుల ఫంక్షన్కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఇలా ప్రేక్షకుల నీరాజనం, సినీ ప్రముఖుల ప్రశంసలతో మోహన్బాబు కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునే ఓ చిత్రంగా ఇది నిలిచింది. |
హిట్ డైలాగ్స్..!!
|
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..