రజనీ రూ.45 లక్షలిచ్చాడు: మోహన్బాబు
‘పెదరాయుడు’ షూటింగ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తన స్నేహితుడు రజనీకాంత్ రూ.45 లక్షలు ఇచ్చాడని నటుడు మోహన్బాబు అన్నారు. మోహన్బాబు ప్రధాన పాత్రలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం...
ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న నటుడు
హైదరాబాద్: ‘పెదరాయుడు’ షూటింగ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తన స్నేహితుడు రజనీకాంత్ రూ.45 లక్షలు ఇచ్చాడని నటుడు మోహన్బాబు తెలిపారు. మోహన్బాబు ప్రధాన పాత్రలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి బ్లాక్బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారంతో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు అయిన సందర్భంగా మోహన్బాబు తాజాగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
‘మా అన్నయ్య నందమూరి తారకరామారావు చేతుల మీదగా 1982లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ను ప్రారంభించాను. మొదట్లో ‘ప్రతిజ్ఞ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాను. మా బ్యానర్లో ఎన్నో చిత్రాలు రూపొందించి జయపజయాలను చూశాను. అయితే 1995లో మా బ్యానర్పై ‘పెదరాయుడు’ నిర్మించాం. అదే ఏడాది జూన్ నెలలో ఆ సినిమాని విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. కోలీవుడ్లో తెరకెక్కిన ‘నాట్టమై’ ఆధారంగా చేసుకుని ‘పెదరాయుడు’ నిర్మించాం. రజనీకాంత్ చెప్పడంతోనే ‘నాట్టమై’ చూసి, నచ్చడంతో కాపీ రైట్స్ కొనుగోలు చేశాను. డైరెక్టర్ రవిరాజా నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి ‘ఎం.ధర్మరాజు ఎం.ఏ’ సినిమా తీశాం. ‘నాట్టమై’ గురించి చెప్పగానే ఒకరోజు టైం కావాలని అన్నాడు. ఆ తర్వాత రోజు వచ్చి డైరెక్ట్ చేస్తానన్నాడు.’
‘రవిరాజా ఒప్పుకున్నాక రజనీకాంత్కి కాల్ చేసి పెదరాయుడు తండ్రి పాపారాయుడు పాత్రకి ఏ నటుడ్ని ఎంపిక చేయాలో తెలియడం లేదని చెప్పాను. దానికి రజనీ తాను ఆ పాత్ర చేస్తానని చెప్పాడు. ‘పెదరాయుడు’ టైటిల్ చెప్పింది కూడా రజనీకాంతే. అలా నటీనటులందర్ని ఎంపిక చేసుకున్నాక ఎన్టీఆర్ చేతుల మీదుల సినిమా ప్రారంభించాం. తూర్పుగోదావరి జిల్లాలో షూటింగ్ చేశాం. అక్కడి మనుషులు చాలా మంచివాళ్లు. ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అక్కడి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ జిల్లాలో షూటింగ్ చేసిన నా సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి.’
‘రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోన్న సమయంలో నేను కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ విషయం రజనీకాంత్కి తెలిసింది. వెంటనే అతను రాజమండ్రి వచ్చి రూ.45 లక్షలు ఇచ్చాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు. రిలీజ్ అయ్యాక డబ్బులివ్వమని అన్నాడు. అలాంటి మంచి స్నేహితుడు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని మోహన్బాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి