ఎంటర్‌టైన్‌ చేసేందుకు సెలబ్రిటీలు సిద్ధం

దాదాపు మూడు నెలల తర్వాత చిత్రపరిశ్రమలో సందడి మొదలైంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే పలు బుల్లితెర సీరియల్స్‌ షూటింగ్స్‌ ప్రారంభం కాగా.. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ చిత్రీకరణలు కూడా ప్రారంభించారు...

Published : 19 Jun 2020 01:32 IST

సెట్‌లో అడుగుపెట్టిన యాంకర్స్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు మూడు నెలల తర్వాత చిత్రపరిశ్రమలో సందడి మొదలైంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే పలు బుల్లితెర సీరియల్స్‌ షూటింగ్స్‌ ప్రారంభం కాగా.. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ చిత్రీకరణలు కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా అనసూయ, సుమ, భానుశ్రీ షూటింగ్స్‌లో పాల్గొన్నారు. సెట్‌లో దిగిన పలు ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రభుత్వ నియమాలను పాటిస్తూ.. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని సెట్‌లో అడుగుపెట్టామని వారు పేర్కొన్నారు. మరోవైపు యోగాతో సేద తీరిన వర్షిణి.. పలు ఫొటోలు షేర్‌ చేసి నెటిజన్ల చూపు ఆకర్షించారు.

ఇదిలా ఉండగా వెండితెర తారలు సైతం పలు ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. అమ్మ ఫొటోని బన్నీ ఫొటో చేయగా.. విశ్వక్‌ సేన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. నటి కియారా అడ్వాణీ తన తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలుపగా.. లావణ్య, నభా నటేశ్‌ పలు ఫొటోలతో మెప్పించారు. అంతేకాకుండా మహేశ్‌ కుమార్తె సితార ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. ఇలా ఈరోజు సోషల్‌మీడియాలో సందడి చేసిన సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి..!










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని