అది అమృత స్టేట్‌మెంట్‌ కాదు: బాలస్వామి 

ఆర్జీవీ ‘మర్డర్’ చిత్రంపై అమృత వ్యాఖ్యల పేరటి పలు పత్రికల్లో వసోన్న కథనాల గురించి తాజాగా ఆమె మామయ్య బాలస్వామి స్పందించారు. సదరు వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకూ ‘మర్డర్‌’ సినిమా...

Published : 22 Jun 2020 14:46 IST

ఆర్జీవీ సినిమా గురించి ఆమె స్పందించలేదు

హైదరాబాద్‌: ఆర్జీవీ ‘మర్డర్’ చిత్రంపై అమృత వ్యాఖ్యల పేరిట పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వసోన్న కథనాల గురించి తాజాగా ఆమె మామయ్య బాలస్వామి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటివరకూ ‘మర్డర్‌’ సినిమా గురించి ఆమె ఏవిధంగానూ స్పందించలేదని తెలిపారు. ఆమె పేరుతో వస్తోన్న స్టేట్‌మెంట్స్‌ను నమ్మవద్దని అన్నారు. నిజ జీవితంలో జరిగిన ఓ కథను ఆధారంగా చేసుకుని రూపొందనున్న ‘మర్డర్‌’ చిత్రానికి ఆనంద్ చంద్రా దర్శకత్వం వహించనున్నారు. రామ్‌గోపాల్‌వర్మ చిత్రంగా నిర్మితం కానున్న ఈ చిత్రానికి నట్టి రుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అయితే, ఆదివారం ఫాదర్స్‌డే సందర్భంగా ‘మర్డర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవీ తన ట్విటర్‌ ఖాతా వేదికగా నెటిజన్లతో పంచుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని