‘శివ’ జ్ఞాపకాలతో సంచలన డైరెక్టర్‌..!

అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘శివ’ చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా మారారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ చిత్రంతో దర్శకుడిగా ఆయన వేసిన తొలి అడుగులోనే మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే....

Updated : 24 Jun 2020 13:55 IST

ఆర్జీవీ ఏం ట్వీట్‌ చేశారంటే..

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘శివ’ చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా మారారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ చిత్రంతో దర్శకుడిగా ఆయన వేసిన తొలి అడుగులోనే మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నాగార్జునను మాస్‌ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసిన ‘శివ’ షూటింగ్‌ రోజుల్ని తాజాగా ఆర్జీవీ గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌ సమయంలో రఘువరన్‌ (శివవిలన్‌)తో తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్‌‌ చేశారు. ‘‘శివ’ చిత్రీకరణ సమయంలో రఘువరన్‌కు ఓ సన్నివేశాన్ని వివరిస్తున్న నేను’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆర్జీవి పెట్టిన ట్వీట్‌పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్‌.. మీ నుంచి ‘శివ’ తరహా చిత్రాలను ఆశిస్తున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు. 

స్టూడెంట్‌ గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ చిత్రంలో ‘శివ’ పాత్రలో నాగార్జున మెప్పించగా.. ప్రతినాయకుడు భవానీగా రఘువరన్‌ ఆకట్టుకున్నారు. అమల కథానాయికగా 1989లో విడుదలైన ఈ సినిమా ఆర్జీవీతోపాటు నాగార్జున కెరీర్‌లో సైతం ఓ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆర్జీవీ - నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ 2018లో విడుదలై మిశ్రమ స్పందనలుందుకున్న సంగతి తెలిసిందే.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని