విద్యుల్లేఖ వెయిట్ లాస్ జర్నీ ఇది!
తనదైన నటన, కామెడీ టైమింగ్తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి విద్యుల్లేఖ రామన్. బొద్దుగా ఉండే ఈ విద్యుల్లేఖ కొన్ని రోజుల కిందట కురచ దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆమె బరువు తగ్గిన ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్
అప్పుడు హేళన చేశారు.. ఇప్పుడు పొగుడుతున్నారు
చెన్నై: తనదైన నటన, కామెడీ టైమింగ్తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి విద్యుల్లేఖ రామన్. బొద్దుగా ఉండే ఈ విద్యుల్లేఖ కొన్ని రోజుల కిందట కురచ దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆమె బరువు తగ్గిన ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. తన బరువు విషయంలో విమర్శలు వచ్చాయని, అవెంతో బాధించాయని గతంలో ఆమె ఆవేదన చెందారు. ఇప్పుడు తాను ఎలా బరువు తగ్గింది? ఎలాంటి కసరత్తులు చేశారు? తన ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పాటు, ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారిలా..
‘‘ఫేక్ నమ్మకానికి.. నిజమైన నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను అధిక బరువు ఉన్నప్పుడు ‘నువ్వు ఎలా ఇంత ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతున్నావు?’ అని నన్ను చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు నిజంగా నాలో విశ్వాసం పెరిగింది. ఎందుకంటే.. నేను సాధించలేను అనుకున్నది.. సాధించా. నా లైఫ్స్టైల్ను, అలవాట్లను మార్చుకున్నా. మనసుపెడితే ఏదైనా సాధ్యమేనని అర్థం చేసుకున్నా.. ఇది నిజం.’’
‘‘నన్ను ద్వేషించుకోవడంతో నా ప్రయాణం ప్రారంభం కాలేదు. నన్ను నేను కొత్తగా మలుచుకోవాలన్న ఆలోచన నుంచి ఇది పుట్టింది. నేను 86 కిలోలు ఉంటే బాగుంటాను. కానీ, అది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా నేను చిరుతిళ్లు అంటే పడి చస్తా. నిద్రపోయే సమయం కూడా సరిగా ఉండదు. దీనితో పాటు నాకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) సమస్య ఉంది. రుతుక్రమం కూడా సరిగా వచ్చేది కాదు. నడుం నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోయేదాన్ని. మధుమేహం వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఆ దెబ్బతో నాకు మత్తు వదిలినట్లైంది. దాంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా’’
‘‘నేచురోపతి, ఆయుర్వేద, యోగాలను ఉపయోగించి బరువు తగ్గడం ప్రారంభించా. మూడు నెలల్లో 5-6 కిలోలు తగ్గా. కీటోజెనిక్ డైట్ ప్రారంభించా. దీని వల్ల ఊబకాయం తగ్గడం మొదలైంది. ఈ విషయంలో నా ట్రైనర్ నవీన్ ఎంతో సహకరించారు’’
‘‘నేను 86 కేజీలు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా. కానీ, ఆరోగ్యంగా లేను. ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగానూ ఉన్నాను. బాడీ షేమింగ్కు నేను వ్యతిరేకం, కానీ బాడీ పాజిటివిటి కాదు. బరువు తగ్గే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఫిట్గా తయారు కావడానికి ఎలాంటి దగ్గరి మార్గాలు(షార్ట్ కట్స్) ఉండవు. అందుకు వ్యక్తిగతంగా ఎంతో ఓపికగా కృషి చేయాలి’’
‘‘జీవితంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. వారంలో ఆరు రోజులు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఎటువంటి రహస్యాలు, మందులు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన శ్రమ చాలు.. మన కన్నీరు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. 2020 జూన్ 20 నాటికి నా బరువు 68.2 కిలోలు..’’
‘‘ఈ ఏడాది జనవరిలో చెన్నై మారథాన్లో పాల్గొన్నా. 10కి.మీ. దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేయడం నాకు సంతోషం అనిపించింది. దురదృష్టవశాత్తూ జనవరి మధ్యలో నా గాల్బ్లేడర్లో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించా. అందులో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. బరువు తగ్గుదామనుకున్న సమయంలో ఇలా జరిగింది. కొవిడ్-19 లాక్డౌన్తో అందరం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే, ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. ఎంతో కాలంగా బరువు తగ్గాలన్న నా కలను సాకారం చేసుకునేందుకు దృష్టి సారించా. జనవరిలో 77కేజీల ఉన్న నేను జూన్ నాటికి 68 కిలోలకు తగ్గా. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. కానీ, ఒక విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం. ఈ సమయాన్ని మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు, ఆరోగ్యం ఉండేందుకు ఉపయోగించుకోండి’’
‘‘నేను లావుగా ఉండటం, బొద్దుగా కనిపించడం వల్లే నాకు ప్రత్యేకంగా కామెడీ సన్నివేశాలు రాసేవారు. మొదట్లో దాన్ని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఆ తర్వాత వెండితెరపైనా, బయట నా బరువుపై విమర్శలు చేసేవారు. అప్పట్లో ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ధైర్యం లేదు. కానీ, ఇప్పుడు నా శరీర బరువుపై జోక్స్ రాయొద్దని నా దర్శక-రచయితలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఒకప్పుడు నన్ను హేళన చేసిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. సమాజాన్ని బతిమాలుకోనవసరం లేదు. నాకు ఏం కావాలో అదే చేశా’’ అని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?