అందుకే మట్టిస్నానం చేస్తానంటున్న నర్గీస్‌!

కథానాయికలకు అన్నింటికంటే ముఖ్యమైంది అందం...ఫిట్‌నెస్‌. ఈ రెండింటి కోసం నాయికలు నానా తంటాలు పడుతుంటారు. ఎవరిశైలిలో

Published : 02 Jul 2020 10:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయికలకు అన్నింటికంటే ముఖ్యమైంది అందం...ఫిట్‌నెస్‌. ఈ రెండింటి కోసం నాయికలు నానా తంటాలు పడుతుంటారు. ఎవరిశైలిలో వాళ్లు అందానికి మెరుగులు దిద్దుకుంటూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. బాలీవుడ్‌ అందాల నాయిక నర్గీస్‌ ఫక్రీ ఒంటి నిండా ఎర్రమట్టి రాసుకొని ఎండలో నిల్చుంది. గులాబీ రంగు బికినీ ధరించి ఒంటి నిండా ఎర్రమట్టితో నిల్చున్న ఆమె అందం సూర్యకాంతి తగిలి రెట్టింపైంది. మడ్‌బాత్‌ చేస్తూ పులకించిపోయిన నర్గీస్‌ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది.

‘‘జీవితంతో పాటు శరీరంలోని మలినాలను ఇలా ఒక్కోసారి బయటకు పంపే పనిచేస్తుండాలి. అప్పుడే కొత్త అందంతో మెరుస్తాం. ఎర్రమట్టి స్నానం శరీరంలోని మలినాలను తొలిగించడమే కాదు...కొత్త సాంత్వన ఇస్తుంది. మట్టి పూసుకొని ఎండలో నిల్చోవడం వల్ల విటమిన్‌ డి పుష్కలంగా లభిస్తుంది’’ అంటూ పోస్ట్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని