వాళ్ల ఇష్టమొచ్చినట్లు ఊహించుకుంటారు: నిత్య
తన నటన, అందంతో ఆకట్టుకున్న నటి నిత్యామేనన్. గతంలో తన శరీర బరువు విషయంలో ఎంతోమంది నుంచి విమర్శలు
ఇంటర్నెట్డెస్క్: తన నటన, అందంతో ఆకట్టుకున్న నటి నిత్యామేనన్. గతంలో తన శరీర బరువు విషయంలో ఎంతోమంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘‘అవును. మీరు తప్పకుండా అలాంటి వారి బారిన పడి ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. నీకన్నా ఎక్కువ బరువు ఉన్న వాళ్ల నుంచి నీకు ఎలాంటి విమర్శలు ఎదురుకావు. అయితే, నీకన్నా సన్నగా ఉన్నవాళ్లే నిన్ను విమర్శిస్తారు. నువ్వు ఎందుకు బరువు పెరుగుతున్నావ్? అని ఎవరూ అడగరు. అంతా వాళ్లు ఊహించుకుంటారు. అందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటారు. అంతకన్నా ఎక్కువగానే ఆలోచిస్తారు’’ అని నిత్యామేనన్ చెప్పుకొచ్చారు.
తన శరీర బరువు విషయంలో విమర్శలు ఎదురైనప్పుడు తాను ఎదురు ప్రశ్నించలేదని, బాధపడలేదని నిత్య తెలిపారు. ‘అవన్నీ చాలా చిన్నవి. వ్యక్తిగత విషయాలు సమస్యల గురించి ఎలుగెత్తి పోరాటం చేయడాన్ని నేను అంతగా నమ్మను. వీటిని నువ్వే అధిగమించాలి. ఇలాంటి వాటి గురించి ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడను. ఇండస్ట్రీలోని వాళ్లు నా శరీర బరువును చూస్తున్నారా? లేక నన్ను చూస్తున్నారా? అనే విషయాన్ని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. అదే మాట్లాడుతుంది’’ అని నిత్యామేనన్ అన్నారు. ‘మిషన్ మంగళ్’ చిత్రం ద్వారా గతేడాది బాలీవుడ్లోకి అడుగు పెట్టిన నిత్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన ‘బ్రీత్: ఇన్ టూ ది షాడోస్’ వెబ్ సిరీస్ జులై 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!