గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన రేణుదేశాయ్‌

ప్రముఖ యాంకర్‌ ఉదయభాను విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను నటి, దర్శకురాలు రేణుదేశాయ్‌ స్వీకరించారు. ఇందులో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఎంపీ జోగినిపల్లి

Published : 04 Jul 2020 01:42 IST

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌ ఉదయభాను విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను నటి, దర్శకురాలు రేణుదేశాయ్‌ స్వీకరించారు. ఇందులో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా యాంకర్ ఉదయభాను.. హాస్యనటుడు బ్రహ్మానందం, నటి రేణు దేశాయ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రహ్మానందం ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయగా, ఇప్పుడు రేణు దేశాయ్‌ తన కుమార్తె ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ, ఎవరికి వారు స్వయంగా నామినేట్‌ చేసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

సోనీ చరిష్ఠ కూడా..

కథానాయిక సోనీ చరిష్ఠ కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పాటు, మరికొన్ని మొక్కల్ని దత్తత తీసుకుని... వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నానని సోనీ చరిష్ఠ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని