ఐశ్వర్యరాయ్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కరోనా సోకింది. ఆమెతోపాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated : 13 Jul 2020 09:21 IST

ముంబయి: ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కరోనా సోకింది. ఆమెతోపాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు అభిషేక్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు శనివారం కరోనా పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఐశ్వర్య, ఆరాధ్య శాంపిల్స్‌కు పాజిటివ్‌ వచ్చింది. తొలుత యాంటీజెన్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చింది.. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటికే అభిషేక్‌కు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌, ఇతర కుటుంబసభ్యులకు నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య, ఆరాధ్య సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని అభిషేక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని